
ఏపీలో బీజేపీ నిర్వహిస్తున్న సంస్థాగత సమావేశాలలో భాగంగా ఈరోజు అరకు పార్లమెంటు జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, లోకుల గాంధీ, జిల్లా అధ్యక్షుడు పంగి రాజా రావు, జిల్లాకు చెందిన ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా పార్టీ సంస్థాగత విషయాలు, భవిష్యత్ కార్యక్రమాలు, స్థానిక ప్రజా సమస్యలపై చర్చించారు.