https://oktelugu.com/

Balapur laddu: వేలంపాటలో రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ..

గణపతి ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూకు ప్రత్యక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఈ లడ్డు దక్కించుకొనేది ఎవరు.. ఎంతకు వేలం లో ధర పలుకుతుందనేది అందరూ ఆసక్తిగా చూస్తారు. ఈసారి ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. ఈ సారిలో వేలంలో హోరా హోరీగా లడ్డు దక్కించుకొనేందుకు ప్రముఖలు పోటీ పడ్డారు. బాలాపూర్ గణపతి లడ్డూ రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ఎమ్మెల్యే రమేశ్ యాదవ్ తో కలిసి నాదర్ గూల్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 19, 2021 / 12:09 PM IST
    Follow us on

    గణపతి ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూకు ప్రత్యక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఈ లడ్డు దక్కించుకొనేది ఎవరు.. ఎంతకు వేలం లో ధర పలుకుతుందనేది అందరూ ఆసక్తిగా చూస్తారు. ఈసారి ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. ఈ సారిలో వేలంలో హోరా హోరీగా లడ్డు దక్కించుకొనేందుకు ప్రముఖలు పోటీ పడ్డారు.

    బాలాపూర్ గణపతి లడ్డూ రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ఎమ్మెల్యే రమేశ్ యాదవ్ తో కలిసి నాదర్ గూల్ వాసి మర్రి శశాంక్ రెడ్డి లడ్డూను రూ. 18.90 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్ ప్రధాన కూడలిలో జరిగిన వేలంపాట కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు 2019 లో బాలపూర్ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి వేలంపాటకు వచ్చారు. ఆ సమయంలో రూ. 17.60 లక్షలకు రాంరెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాటలో స్థానికులైతే మరుసటి ఏడాది డబ్బు చెల్లించేలా నిబంధన ఉంది. అదే స్థానికేతురులైతే అప్పటికప్పుడు చెల్లించాలి. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

    కొవిడ్ కారణంగా గతేడాది వేలంపాట జరగని విషయం తెలిసందే. మరో వైపు భజన బృందం, డప్పు చప్పుళ్లు సందడి నడుమ ఊరేగింపు వైభవంగా సాగుతోంది. బాలాపూర్ ప్రధాన వీధుల్లో కార్యక్రమాన్ని సందడిగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండానలి బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొన్నా. శశాంక్ రెడ్డితో కలిసి లడ్డూను దక్కించుకుననా. సీఎం జగన్ కు లడ్డూను కానుకగా ఇవ్వాలనే వేలంలో పాల్గొన్నారు. అని రమేశ్ యాదవ్ తెలిపారు.