
ఏపీ ఈఏపీసెట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ ఫలితాలను వెల్లడించగా తాజాగా అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను ప్రకటించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రమేశానికి 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 72,488 మంది ఉత్తీర్ణులయ్యారు.