అంబులెన్సుల అడ్డగింత.. కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ ల వివాదం పై హైకోర్టు లో విచారణ జరుగుతోంది. చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని కోర్టుకు ఏజీ విన్నవించారు. ప్రతి పేషేంట్ కు ఆస్పత్రి అడ్మిషన్ ఉండాలని ఏజీ అన్నారు. తాము ఆదేశాలు ఇచ్చినా సర్క్యలర్ ఎలా జారీ చేస్తారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉందని, విజయవాడ, […]

Written By: Suresh, Updated On : May 14, 2021 3:47 pm
Follow us on

తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ ల వివాదం పై హైకోర్టు లో విచారణ జరుగుతోంది. చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని కోర్టుకు ఏజీ విన్నవించారు. ప్రతి పేషేంట్ కు ఆస్పత్రి అడ్మిషన్ ఉండాలని ఏజీ అన్నారు. తాము ఆదేశాలు ఇచ్చినా సర్క్యలర్ ఎలా జారీ చేస్తారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉందని, విజయవాడ, హైదరాబాద్ మార్గం నేషనల్ హైవే దానికి కేంద్ర ప్రభుత్వంపై అధికారం ఉంటుందని తెలిపింది. తెలంగాన ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదని తెలిపింది. అంబులెన్స్ లను ఆపడానికి తెలంగాణ సర్కార్ కు హక్కు లేదని ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూేడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యలర్ లాంటిది ఇవ్వలేదని తెలిపింది. కోర్టు చెప్పినా కూడా ఆదేశాలు పాటించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.