
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల నుంచి ప్రారంభమైన ఆక్రమణల పరంపర రాజధాని కాబుల్ వద్దకు చేరింది. కాబుల్ చుట్టూ ఉన్న అన్ని పెద్ద పట్టణాలను ఇప్పటికే తమ ఆధీనంలో తీసుకున్నది. తాజాగా ఆదివారం ఉదయం జలాలాబాద్ లో కూడా తమ జెండాను పాతారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా జలాలాబాద్ ను తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. దీంతో రాజధాని నుంచి పాకిస్థాన్ కు ఉన్న రోడ్డు కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది. శనివారం కాబూల్ కు ఉత్తరాన ఉన్న మరో పెద్ద పట్టణమైన మజర్ -ఇ- షరీఫ్ ను ఆక్రమించుకున్నది.