అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ కు రాష్ట్రంలో 10 వేల ఉద్యోగ ఖాలీలే కనిపించాయా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. సీఎం చేసిన మోసం వల్లే యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా చనుగొండ్ గ్రామంలో నిరుద్యోగి గోపాల్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటీకి ప్రభుత్వ హత్యే అని అతడి కుటుంబానికి తక్షణమే రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.