
ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,01,863 పరీక్షలు నిర్వహించగా 8,239 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,96,122 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 61 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,824కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,100 యాక్టివ్ కేసులున్నాయి.