
దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. గత మూడు రోజుల్లో కాస్త తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 3.82.315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. మరో 3.780 మంది మమమ్మారి బారిన పడి మరణించారు. తాజాగా 3,83,439 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,65,148కు పెరిగింది. ఇప్పటి వరకు 1,69,51,731 మంది కోలుకున్నారు. మరో 2,26,188 వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.