
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 నమూనాలకు పరీక్షించగా 2,524 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,78,351కి చేరింది. తాజాగా మరో 18 మంది మహమ్మారికి బలవ్వగా మొత్తం మృతుల సంఖ్య 3,281కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 34,084 క్రియాశీలఅ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ 3,464 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు పేర్కొంది.