
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 20,937 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొవిడ్ తో 10 మంది మరణించారు. తాజా కేసులతో కలుపుకని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,42,079కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,156గా ఉంది. కొవిడ్ తో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 9,904 కి చేరింది. గత 24 గంటల్లో చిత్తూరు లో అత్యధికంగా 15 మంది మృతి చెందగా ప్రకాశం, విజయనగరలో 10 మంది చొప్పున మరణించారు.