
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. మరోసారి మూడు లక్షలకు దిగువన కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు 4వేలకు పైగా రికార్డవగా తాజాగా నాలుగు వేలకు దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 2,11,298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా 2,83,135 మంది బాధితులు కోలుకున్నారని పేర్కొంది. వైరస్ బారినపడి కొత్తగా 3,847 మంది ప్రాణాలు వదిలారని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 పెరిగింది. మొత్తం 2,46,33,951 మంది కోలుకున్నారు.