
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వ్యాక్సిన్ ల వినియోగంలో ధనిక దేశాలే ముందున్నాయి. స్వయంగా డబ్ల్యూహెచ్ వో గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలో ధనిక, ఎగువ మధ్యతరగతి దేశాల జనాభా 53 శాతం ఉండగా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లో 83 శాతాన్ని ఆ దేశాలే వినియోగించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక పేద, దిగువ మధ్యతరగతి దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 47 శాతం ఉందని, కానీ ఆయా దేశాల్లో వ్యాక్సిన్ వినియోగం కేవలం 17 శాతం మాత్రమే ఉన్నదని WHO వెల్లడించింది.