కేంద్ర మంత్రి వర్గంలోని సీనియర్లకు ఊహించని షాక్ ఎదురవుతోంది. కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మొదట కొద్ది మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి సంచలనం రేపారు. కేబినెట్ విస్తరణకు కొద్ది నిమిషాల ముందు మరో ఊహించని వార్త వచ్చింది. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి ప్రకాశ జవదేకర్ తమ పదవులకు రాజీనామా చేశారు.