ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వద్ద ఆనందయ్య మందు పొట్లాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ప్రకాశం జిల్లా సమీక్షకు హాజరైన మంత్రులకు ఆయన ఈ మందు పొట్లాలను అందజేస్తుంగా మీడియా కంటపడింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి ఈ మందు పొట్లాలను ఎంపీ అందజేశారు.