Ranga Marthanada: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన శక్తిని అంతా ధారపోసి చేస్తున్న సినిమా ‘రంగమార్తాండ’. అయితే, ఈ సినిమాకు బడ్జెట్ సమస్యలు తలెత్తాయి. ఓ 10 శాతం షూటింగ్ ఉందనగా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పట్లో మొదలు కాదు అని కూడా పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఓటీటీ నుంచి ఈ సినిమాకు మంచి ఆఫర్ వచ్చింది. పైగా, ఇండస్ట్రీలో ఈ సినిమాపై పాజిటీవ్ బజ్ కూడా నడుస్తోంది.
krishna vamsi prakash raj
దాంతో.. `రంగమార్తాండ`కు మంచి రోజులొచ్చాయి. ఎట్టకేలకు `రంగమార్తాండ` షూట్ కు మోక్షం కలిగింది. ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయడానికి కృష్ణవంశీ కసరత్తులు చేస్తున్నాడు. మరో పది రోజుల్లో రంగమార్తండ షూటింగ్ మొత్తం ఫినిష్ కానుంది. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
Also Read: Nayanthara- Vignesh Shivan Assets: షాకింగ్.. నయన్ – విఘ్నేశ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
కృష్ణవంశీకి మాత్రం ఈ సినిమాని నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని కోరిక ఉంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. అయితే, రెండేళ్ల క్రితం మొదలైంది ఈ ‘రంగమార్తాండ’. అసలు ఈ సినిమా లేట్ అవ్వడానికి కారణం కృష్ణవంశీనే. ఎప్పుడూ లేనిది ఈ సినిమాకి నలుగురు రచయితలను పెట్టుకున్నాడు.
Ranga Marthanada
పైగా తన సినీ కెరీర్ లోనే ఈ సినిమా కోసం తీసుకున్నన్నీ జాగ్రతలు, మరో సినిమా కోసం తీసుకోలేదు. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలి అని కృష్ణవంశీ ఆశ. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన జంట. సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యువ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ యువ జంటగా కనిపిస్తారు.
అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా బలమైనదట, కృష్ణవంశీ ఈ పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడట.
Also Read: Venkatesh- Ravi Teja: వెంకటేష్ – రవితేజ కాంబినేషన్ లో మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?