spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pensions: పింఛన్లలో కోతతో వైసీపీకి నష్టం జరుగుతుందా?

Pensions: పింఛన్లలో కోతతో వైసీపీకి నష్టం జరుగుతుందా?

PensionsPensions: ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పింఛన్లలో కోత విధిస్తున్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న వైసీపీ ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటీవల ప్రభుత్వం పింఛన్ల లో కోత విధిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు నిరాశలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఏపీలో నిధుల కొరత వేధిస్తోంది. దీంతో పింఛన్ల లబ్ధిదారులను తగ్గించేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై సహజంగానే ఆగ్రహం పెరుగుతోంది.

వైఎస్సార్ హయాం నుంచే పింఛన్ల పంపిణీ జరుగుతోంది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి పింఛన్లు ఇచ్చేవారు. ఇటీవల సడలించిన నిబంధనలతో కుటుంబంలో ఒక్కరికే పింఛన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. దీంతో అందరిలో ఆందోళన పెరుగుతోంది. పింఛన్ల తొలగింపుపై మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వద్దని వారిస్తున్నారు. ఇలా చేస్తే భవిష్యత్ లో కష్టాలు తప్పవని హెచ్చరికలు చేస్తున్న సీఎం జగన్ పట్టించుకోవడం లేదు.

జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఒక్కసారి మాత్రమే పెంచి చేతులు దులుపుకుంది. ఇప్పుడు ఉన్న వాటినే తీసేస్తోంది. దీంతో లబ్ధిదారుల్లో నిరాశే పెరుగుతోంది. అసెంబ్లీలో కూడా విపక్షాలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. దీంతో వైసీపీ సర్కారుకు పింఛన్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

కేబినెట్ భేటీలో పింఛన్ల తొలగింపుపై జగన్ స్పష్టత ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పింఛన్లలో కోతలు తప్పవని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీకి ఇది పెద్ద గుదిబండగా మారే సూచనలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందర కూడా సైలెంట్ అయిపోయారు. ఏది జరిగినా ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. పింఛన్లలో కోతలు తప్పవని చెప్పేశారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...

Three Sisters Marry One Man: ఒక యువకుడితో ముగ్గురు పెళ్లి చేసుకుందే కాక.. దారుణం.. ఇది ఊహించని...

Three Sisters Marry One Man: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ గురించి రచ్చ రచ్చ జరుగుతుంటే.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం మీడియం మొత్తం తన వైపు తిప్పుకున్నారు. తమ గురించి మాట్లాడుకునే...
Oktelugu Epaper
Exit mobile version