Raghav Chadha Parliament Speech: 2026 మార్చి 10, లోక్సభలో బడ్జెట్ చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా యువ ఎంపీ లేచి మాట్లాడడం మొదలు పెట్టారు. అయితే గతంలో ఎవరూ ప్రస్తావించని అంశాలను ప్రస్తావించారు. సామాన్యుడి కోణంలో లోక్సభ సాక్షిగా అనేక ప్రశ్నలు కేంద్రానికి సంధించారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పెరుగుదల, మొబైల్ రీచార్జీల ధరలు, బ్యాంక్ పెనాల్టీలను యువ ఎంపి ఎక్కుపెట్టిన తీరు యావత్ దేశాన్ని ఆకర్షించింది. తెలుగు రాష్ట్రాల నుంచి∙ఎన్నికైన ఈ యువ సభ్యుడి పేరు రాఘవ్ చద్దా. ఇన్స్పైర్డ్ వాయిస్గా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ల ముందు నిలబడ్డాడు.
యువ ఎంపీ బ్యాక్గ్రౌండ్..
ఈ యువ ఎంపీ ఆంధ్రప్రదేశ్ రాసపూడిపాలెం నుండి వచ్చినవాడు. ఐటీ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎన్నికల సమయంలోనే ‘మధ్యతరగతి రక్షణ‘ అనే స్లోగన్తో ప్రజల మద్దతు పొందాడు. పార్లమెంట్కు వచ్చాక, రాఘవ్ చద్దా సోషల్ మీడియా పోస్టులు చదివి, 10 వేల మంది లేఖలు సేకరించాడు. ‘ద్రవ్యోల్బణం 6% పెరిగింది, కానీ జీతాలు 2% మాత్రమే పెరిగాయి. ఇది అన్యాయం!‘ అని తన స్పీచ్కు రెడీ అయ్యాడు.
దద్దరిల్లిన పారల్మెంట్..
స్పీకర్ చైర్లో కూర్చుని, లోక్సభ గ్యాలరీలు నిండినప్పుడు, యువ ఎంపీ లేచి మాట్లాడాడు. ‘ప్రధాని గారు, మీరు ’వికసిత్ భారత్’ చెప్తున్నారు. కానీ సామాన్యుడి జీవితం ఎందుకు కష్టమవుతోంది? 28 రోజుల రీచార్జ్ పేరుతో రూ.350–400 తీసుకుంటున్నారు. కాల్ ప్యాక్ ముగిస్తే సేవలు ఆపేస్తున్నారు.. ఇది సరైన పద్ధతా?‘అని నిలదీశాడు. దీంతో మోదీ ముఖం మారిపోయింది. నిర్మలా సీతారామన్ మెల్లగా తప్పించుకున్నారు. అయినా యువ ఎంపీ ఆగలేదు.
కీలక అంశాలు ప్రస్తావన..
‘బ్యాంకులు ఏఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో కనీస బ్యాలెన్స్ లేకపోతే రూ.500 పెనల్టీ, ఇతర ఏటీఎంలలో రూ.25, ఎస్ఎంఎస్కు రూ.60, స్టేట్మెంట్కు రూ.100 రూపంలో బ్యాంకులు కస్టమర్ల నుంచి రూ,3,500 వసూలు చేసినట్లు తెలిపారు.
మంత్రుల సమాధానాలు..
మోడీ లేచి, ‘అమృత్ కాలంలో జీడీపీ 8% పెరిగింది. పన్ను ఉపశమనాలు ఇచ్చాం‘ అని చెప్పారు. కానీ యువ ఎంపీ తన ప్రసంగం కొనసాగించాడు. ఎమ్మెల్యేలకు నెలకు రూ.9 వేల ఫోన్ బిల్లు చెల్లింపులో రూ.8,650 ప్రజలే భరిస్తున్నారన్నారు. రూ.350తో నెలంతా అన్ లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ వస్తున్నాయి. అలాంట్పుడు రూ.8,650 ఎటు పోతున్నాయని నిలదీశారు.
స్పీచ్ తర్వాత, #YouthMPVsModi ట్రెండింగ్ అయింది. రాసపూడిపాలెం ప్రజలు టీవీల ముందు చప్పట్లు కొట్టారు. మోదీ, నిర్మలా సీతారామన్ ‘ముఖంపై నెత్తురు లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి యువకులు ఎంపీలు అయితే అనేక అంశాల్లో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు.