Homeజాతీయ వార్తలువచ్చే ఎన్నికల్లో యోగికి చెక్‌ తప్పదా..?

వచ్చే ఎన్నికల్లో యోగికి చెక్‌ తప్పదా..?

Yogi Adityanath
‘కాయలు ఉన్న చెట్టుకే దెబ్బలు’ అన్నట్లు.. అధికారంలో ఉన్న వ్యక్తులపై, అధికారంలో ఉన్న పార్టీపై నిత్యం విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అంతకుమించి ఏదో ఒక గాసిప్‌ వైరల్‌ అవుతూనే ఉంటుంది. అవి చివరకు అటు పార్టీకి.. ఇటు వ్యక్తికి డ్యామేజీ చేస్తుంటాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు కూడా అలాంటి సెగనే తాకుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా ఆయనకు ముప్పు తీసుకొస్తున్నట్లు సమాచారం.

Also Read: పేదలపై గ్యాస్‌ బండ.. : సబ్సిడీకి కేంద్రం మంగళం

అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌‌ప్రదేశ్‌లో ఏ జెండా ఎగిరితే.. ఆ పార్టీనే ఢిల్లీ పీఠం కైవసం చేసుకుంటుందనేది సెంటిమెంట్‌. అందుకే అన్ని పార్టీలు ఉత్తర్ ప్రదేశ్ పైనే ఎక్కువ దృష్టి పెడతాయి. అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు. కానీ పార్లమెంటు ఎన్నికలు కావచ్చు దేశం దృష్టి మొత్తం ఉత్తర్ ప్రదేశ్ పైనే ఉంటుంది. ఈ రాష్ట్రంలో 75 జిల్లాలున్నాయి. 80 పార్లమెంటు స్థానాలున్నాయి. 403 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ రాష్ట్ర విభజన. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విడగొడతారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది.

చిన్న రాష్ట్రాలకు బీజేపీకి ఎలాగూ అనుకూలమే.. కాబట్టి వచ్చే ఎన్నికలకంటే ముందు ఉత్తర్‌‌ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. గతంలోనూ మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన వచ్చింది. 2011లో మాయావతి తాను అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదనను తెచ్చినట్లు బీజేపీ నేతలు గుర్తించారు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌గా విడగొట్టారు. 2000 సంవత్సరంలో వాజపేయి హయాంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి బుందేల్ ఖండ్, పూర్వాంచల్, అవద్ ప్రదేశ్, హరిత ప్రదేశ్‌గా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: చంద్రబాబుకు షాకిచ్చిన నిమ్మగడ్డ.. టీడీపీ మేనిఫెస్టోకు చెక్

నిజానికి బుందేల్ ఖండ్, పూర్వాంచల్ రాష్ట్రాల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఉత్తర్‌‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. రాష్ట్ర విభజన జరగదని, ఉత్తర్‌‌ప్రదేశ్ చరిత్రను తాము తొలగించేది లేదని ఆయన చెబుతున్నారు. అయితే ఎన్నికల వేళ మాత్రం ఈ ప్రచారం అధికార బీజేపీని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. మరో రెండేళ్లలో ఈ రాష్ట్రానికి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎన్నికల సమయం నాటికి ఏం జరగబోతోందో చూడాలి.

మరిన్ని జాతీయం రాజకీయ వార్తల కోసం జాతీయం పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version