ఏపీ వేదికగా బీజేపీ రామరథయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో పార్టీకి ఊపొచ్చింది. అంతకుముందు పార్టీ కార్యకలాపాలు పెద్దగా కనిపించకపోయేవి. కానీ.. వీర్రాజు అధ్యక్షుడయ్యాక ప్రభుత్వంపై విమర్శల అస్త్రం సంధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తూనే ఉన్నారు. ఇదే ఊపులో మరో కొత్త నిర్ణయానికి తెరలేపారు వీర్రాజు. ఆలయాలను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ కపిల తీర్థం టు రామతీర్థం రథయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. విశాఖలో జరిగిన ఏపీ కోర్ కమిటీ సమావేశంలో ఈ […]

Written By: Srinivas, Updated On : January 18, 2021 10:27 am
Follow us on


ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో పార్టీకి ఊపొచ్చింది. అంతకుముందు పార్టీ కార్యకలాపాలు పెద్దగా కనిపించకపోయేవి. కానీ.. వీర్రాజు అధ్యక్షుడయ్యాక ప్రభుత్వంపై విమర్శల అస్త్రం సంధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తూనే ఉన్నారు. ఇదే ఊపులో మరో కొత్త నిర్ణయానికి తెరలేపారు వీర్రాజు. ఆలయాలను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ కపిల తీర్థం టు రామతీర్థం రథయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. విశాఖలో జరిగిన ఏపీ కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Also Read: ఎన్టీఆర్.. తెలుగు జాతి ఖ్యాతిని నలుచెరుగులా చాటిన ‘తారక’రాముడు

ఈ రథయాత్రను ఫిబ్రవరి 4 నుంచి 8 రోజులపాటు నిర్వహిస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. దేవాలయాలపై దాడులు జరిగిన ప్రాంతాలను కలుపుతూ యాత్ర జరుగుతుంది. పిఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలంలో అన్యమత ప్రాబల్యం వంటి ఘటనలపై జన జాగృతి సభలను నిర్వహించనున్నారు. ఓవైపు రాష్ట్రంలో ఆలయాలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎక్కడో ఓ మూలానా ఏదో ఒక వార్త వినాల్సి వస్తూనే ఉంది. అయితే.. ఈ అంశాన్ని రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా తీసుకోలేదని బీజేపీ హైకమాండ్‌ చెప్పినట్లు సమాచారం. అందుకే.. ప్రత్యేక కార్యాచరణను ఢిల్లీ నుంచి ఖరారు చేసి పంపారని చెబుతున్నారు. ఈ మేరకు వారి సూచనల ప్రకారం.. రామరథయాత్రను ఖరారు చేసుకున్నారని చెబుతున్నారు.

Also Read: ఏపీలో స్కూళ్లపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

అయితే.. ఈ రథయాత్రను రామతీర్థం నుంచి ప్రారంభించాలనుకున్నప్పటికీ.. అక్కడే ముగిస్తే మంచి ఎఫెక్ట్ వస్తుందని భావించారు. అందుకే కపిల తీర్థం నుంచి ప్రారంభించాలని తలపించారు. కపిల తీర్థంలో ఎలాంటి వివాదాలు జరగకపోయినప్పటికీ.. అక్కడి నుంచి ప్రారంభిస్తే మంచిదన్న ఉద్దేశంతో ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎనిమిది రోజుల యాత్రలో భాగంగా రోజుకో జాతీయ నేతను పిలిపించాలని ప్లాన్ చేస్తున్నారు. రోజూ కుదరకపోయినా ప్రధాన ఆలయాల దగ్గరకు వచ్చినప్పుడు పిలిపించాలని అనుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఇదిలా ఉండగా.. తమపై ఆరోపణలు చేసిన డీజీపీ విషయంలోనూ బీజేపీ సీరియస్ గా ఉంది. డీజీపీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకని ఈ నెల 20 తేదీలోపు డీజీపీ క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డెడ్ లైన్ పెట్టారు. యాత్రలో ఎవరెవరు పాల్గొనాలనే దానిపై స్పష్టత లేకున్నా ముఖ్య నేతలందరూ పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ముందుగానే రథయాత్ర చేపట్టాలన్న ఆలోచన వచ్చినప్పటికీ.. ఏర్పాట్ల కోసం సమయం కావాలని ఆలోచించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏపీలో ఈ హిందూత్వ రాజకీయాలే రచ్చ చేయబోతున్నాయి. బీజేపీ రామరథయాత్ర చేపడుతుండగా.. ఈనెల 21 నుంచి టీడీపీ తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకుంది.