Homeజాతీయ వార్తలుకశ్మీర్ కు ఎన్నికలతో సమస్య పరిష్కారమయ్యేనా?

కశ్మీర్ కు ఎన్నికలతో సమస్య పరిష్కారమయ్యేనా?

Kashmir electionsకాశ్మీర్ సమస్యపై కేంద్రం దృష్టి సారించింది. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పలు పార్టీల ముఖ్య నేతలతో అఖిలపక్షం సమావేవం నిర్వహించారు. ఇందులో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), గులాం నబీ ఆజాద్ (కాంగ్రెస్)తో పాటు పీసీసీ చీఫ్ జి.ఎ.మిద్, జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోనె, బీజేపీ సీనియర్ నేత రవీందర్ రైనా, సీపీఎం నాయకుడు మహమ్మద్ తారిగామి, పాంథర్స్ పార్టీ అధ్యక్షుడు భీంసింగ్, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు.

370 రద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 ఆగస్టు 5న 370 అధికరణ రద్దు, రాష్ర్ట విభజన, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటన అనంతరం ఈ సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రభుత్వం నడుంబిగించి పార్టీల మధ్య సఖ్యతకు కృషి చేస్తోంది.

రాస్ర్ట విభజనకు ముందు అసెంబ్లీలో 87 సీట్లు ఉన్నాయి. మరో 24 సీట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)కు కేటాయించారు.2019 ఆగస్టులో రాష్ర్ట విభజన అనంతరం లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి నాలుగు సీట్లు కేటాయించారు. కశ్మీర్ లోయలో 46, జమ్ములో 37 కలిపి మొత్తం 83 సీట్లున్నాయి.2014 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 సీట్లు సాధించాయి. రాష్ర్టం జమ్ము, కశ్మీర్ గా విడిపోయింది. కశ్మీర్ లో ముస్లింలు, జమ్ములో హిందువుల ప్రాబల్యం ఎక్కువ.

2011 జనాభా లెక్కల ప్రకారం కశ్మీర్ జనాభా68,88,475, కాగా జమ్ము జనాభా53,75,536. నియోజకవర్గాల పునర్విభజన కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తాత్కాలిక అంచనాల ప్రకారం కశ్మీర్ లో నాలుగు, జమ్ములో మూడు సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ముస్లింపార్టీలైన పీడీపీ, ఎన్ సీ వ్యతిరేకిస్తున్నాయి.

బీజేపీ మరో రకంగా వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ ను దేశంలో లేకుండా చేయాలని చూస్తోంది. ఇందుకు జమ్ములో మెజార్టీ సీట్లు తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. కశ్మీర్ లో పీడీపీ, ఎన్ సీ మధ్య ఓట్లు చీలి చివరికి తమకే లాభం చేకూరుతుందని చూస్తోంది. చిన్న పార్టీల సహకారంతో అధికారం హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో పావులు కదువుపుతున్నట్లు తెలుస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper