Homeజాతీయ వార్తలుMLC Kavitha: అసలు కవిత 10 ఫోన్లు ఎందుకు వాడింది? ఏంటి కథ?

MLC Kavitha: అసలు కవిత 10 ఫోన్లు ఎందుకు వాడింది? ఏంటి కథ?

MLC Kavitha
MLC Kavitha

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయానికి సంబంధించి ఈడీ అధికారులు ప్రధానంగా చేసిన ఆరోపణ.. ఫోన్ల ధ్వంసం. కానీ వీటిని పటాపంచలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత రెండవ దఫా విచారణకు హాజరైనప్పుడు తాను ఏ ఫోన్లనూ ధ్వంసం చేయలేదని, ఆ ఫోన్లు ఇవిగో అంటూ ముందుగా మీడియాకు చూపించారు. ఆ తర్వాత ఆమె ఈడి అధికారుల విచారణకు వెళ్లిపోయారు.. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా ప్రచారాన్ని హోరెత్తించింది. ” చూశారా మా కవిత ఎంత మంచిదో.. ఈ దిక్కుమాలిన బీజేపీ దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెడుతోంది” అంటూ నానా యాగీ చేసింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

వాస్తవానికి ఈడీ గతంలో కవిత ధ్వంసం చేసిన ఫోన్లు తాలూకు వివరాలను మీడియాకు లీక్ చేసింది.. లో ఆమె వాడిన ఫోన్ నెంబర్లు, ఐఎంఐ నంబర్లతో సహా అందులో పొందుపరిచింది. అయితే వాస్తవానికి లిక్కర్ స్కామ్ జరిగింది 2022 కు ముందు. అయితే కవిత మీడియాకు చూపించింది 2022 కు ముందు కొనుగోలు చేసినవి. పైగా తన ఫోన్ లను పని మనుషులు, తోటి కోడళ్ళు వాడతారని అందుకే వాటిని మార్చాల్సి వచ్చిందని కవిత వివరించారు. అయితే ఈ వివరణలో పస లేకపోవడంతో ఈ ఫోన్ల బండారాన్ని సోషల్ మీడియా బట్టబయలు చేసింది.

వాస్తవానికి ఈడి అధికారులు బయటకు వెల్లడించిన ఫోన్ల ఐఎంఐ నంబర్లు వేరు, కవిత మీడియాకు చూపించిన ఫోన్ల ఐఎంఐ నెంబర్లు వేరు.. దీంతో ఇక్కడే కవిత నెటి జన్లకు అడ్డంగా దొరికిపోయింది. ఆమె మీడియా చూపించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా ఐఎంఐ నెంబర్లను నెటిజన్లు కనిపెట్టి పోస్ట్ చేయడంతో భారత రాష్ట్ర సమితి నాయకులు నీళ్లు నమిలారు. వాస్తవానికి లిక్కర్ స్కాం కు సంబంధించిన వ్యవహారాలు మొత్తం ఫోన్ల ద్వారానే జరిగాయని, ఆ వివరాలు మొత్తం బయటపడకుండా ఉండేందుకు ఫోన్లను ధ్వంసం చేశారని ఈడి చెబుతోంది.. అయితే మొదట్లో ఈ విషయాన్ని బుకాయించిన కవిత.. తర్వాత మీడియాకు ఫోన్లను చూపించడమే ఆసక్తికరంగా మారింది.

MLC Kavitha
MLC Kavitha

అయితే ఈ స్కాంలో ఎటువంటి పాత్ర తాను పోషించలేదని చెబుతున్న కవిత.. ఫోన్లను మీడియాకు ఎందుకు చూపించారు అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రస్తుతానికి లిక్కర్స్ స్కాం లో కవిత ఎపిసోడ్ కు సంబంధించి విచారణ నెమ్మదించినప్పటికీ.. ఈడి అధికారులు మరోవైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నారు.. ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ఈ ఏకంగా తాను కోట్ల కొద్ది డబ్బు భారత రాష్ట్ర సమితి నాయకులకు ఇచ్చానని చెప్పడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది.. అంతేకాదు తాను ఈ నగదును రామచంద్ర పిళ్లై ద్వారా ఇచ్చాను అని చెప్పడం లిక్కర్ స్కామ్ లో సరికొత్త మలుపు తీసుకుంది.. అయితే అతడు చెప్పిన వివరాల ఆధారంగా ఆధారాలు తవ్వుతున్న ఈడీ అధికారులు.. మున్ముందు ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version