Homeజాతీయ వార్తలుEarth : భూమిపై జీవం ఎప్పుడు, ఎలా అంతమవుతుంది?

Earth : భూమిపై జీవం ఎప్పుడు, ఎలా అంతమవుతుంది?

Earth : అంతరిక్షం ఎత్తు, సముద్రపు లోతు గురించి శాస్త్రవేత్తలు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని కనుగొంటూనే ఉన్నారు. మన భూమి నేడు పచ్చగా ఉంది. కానీ భూమిపై జీవితం ఎలా అంతమవుతుందనే దానిపై వివిధ భయాలు ఉన్నాయి? కొన్నిసార్లు భూమి వైపు వచ్చే గ్రహశకలం వల్ల ప్రమాదం తలెత్తుతుంది. కొన్నిసార్లు వేరే ఏదో చెబుతారు. భూమి ఎలా అంతమవుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ఈ భూమి నుంచి డైనోసార్ల అంతరించిపోవడం గురించి చాలా విషయాలు చెప్పారు. ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొన్న తర్వాతే ఈ జీవి ఉనికి ముగిసిందని, కాబట్టి ఒక ఉల్కను ఢీకొట్టడం వల్ల భూమి కూడా నాశనం అవుతుందా అని విస్తృతంగా విశ్వసిస్తున్న సిద్ధాంతం ఏది? అయితే శాస్త్రవేత్తలు ఒక సూపర్ కంప్యూటర్ సహాయంతో భూమిపై జీవం ఎప్పుడు, ఎలా అంతమవుతుందో అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఆసక్తికరంగా, డైనోసార్ల మాదిరిగా కాకుండా, మానవులు అంతరించిపోవడానికి కారణం గ్రహశకలం లేదా ఉల్క కాదు అనే సమాధానం వచ్చింది.

Also Read : ఉద్యోగులకు కోలుకోలేని షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

భూమిపై జీవం ఎలా అంతమవుతుంది?
భూమి పై జీవం ఎప్పుడు అంతం అవుతుంది అనే ప్రశ్నకు సమాధానం కోసం ఓ సూపర్ కంప్యూటర్ సహాయం తీసుకున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఆన్సర్ పరంగా చూస్తే సూర్యుని వేడి క్రమంగా మన గ్రహాన్ని నివాసయోగ్యంగా మారుస్తుంది. ఈ వాస్తవాన్ని 2021 సంవత్సరంలో కజుమి ఓజాకి మరియు క్రిస్టోఫర్ టి. రీన్‌హార్డ్ నేచర్ జియోసైన్స్ రీసెర్చ్‌లో ప్రచురించారు. అయితే ఇప్పుడు చెప్పేది వింటే కాస్త భయంగా అనిపిస్తుంది కూడా.. ఎందుకంటే మనం నివిసిస్తున్న ఈ భూమిపై జీవాన్ని నిలబెట్టడానికి అవసరమైన ఆక్సిజన్ స్థాయి చివరికి అయిపోతుందని, ఎవరూ జీవించలేరని పేర్కొంది.

అందరికీ కావాల్సిన ఆక్సిజన్ ఇప్పుడు పర్వాలేదు అనేట్టుగానే ఉంది. అందరికీ కావాల్సినంత ఆక్సిజన్ ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు ఆక్సిజన్ ను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇది పక్కన పెడితే కానీ భూమి వాతావరణంలో ఆక్సిజన్ ఆధారిత బయోసిగ్నేచర్‌ల వయస్సు నిర్ణయించలేదు. ఒక ప్రయోగంలో, భూమి ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్న వాతావరణం కాలపరిమితిని కనుగొన్నారు. అయితే వీరు చేసిన ఈ అధ్యయనం వాతావరణంలోనైనా ఎల్లప్పుడూ తగినంత ఆక్సిజన్ ఉండదని తేల్చింది. ఈ ముగింపు భయానకంగా ఉంది.

Also Raed : తెలంగాణలో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం

భూమిపై జీవితం ఎప్పుడు అంతమవుతుంది?
బ్రిస్టల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక అనుకరణ ద్వారా భవిష్యత్తులో మన గ్రహం స్థితిని అంచనా వేశారు. ఇక ఈ పరిశోధన ప్రకారం రాబోయే కాలంలో ఈ భూమి వేడి చాలా పెరిగే అవకాశం ఉందట. దీనివల్ల ఖండాలు తిరిగి కలిసి పాంజియా అల్టిమా అనే కొత్త సూపర్ ఖండం ఏర్పడుతుంది. పాంగేయా అల్టిమా యుగంలో, భూమి చాలా వేడిగా, పొడిగా ఉంటుంది. అగ్నిపర్వత విస్ఫోటనాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ వేడి కారణంగా, మానవులు, క్షీరదాలు సహా అనేక జాతులు పెద్ద సంఖ్యలో అంతరించిపోతారు. వేడి ఎండ, వాతావరణంలో చాలా కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఆహారం, నీరు ఉండవు. చెమట పట్టడం వల్ల కూడా శరీర వేడి తగ్గదు. శరీరం చల్లగా ఉండలేకపోతుంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే, కానీ ఈ విషయం గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏంటి ఇంత పెద్ద మాట చెప్పి మళ్లీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటారేంటి అనుకుంటున్నారా? మరి దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే భూమిపై జీవం 1,000,002,021 సంవత్సరంలో ముగుస్తుంది అనే సమాధానం చెప్పింది ఆ సూపర్ కంప్యూటర్.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version