ఆంధ్రప్రదేశ్‌Amaravati- BJP: అమరావతి విషయంలో బీజేపీ ఏం చేయనుంది?

Amaravati- BJP: అమరావతి విషయంలో బీజేపీ ఏం చేయనుంది?

Amaravati- BJP: అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించిన బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అమరావతికి మద్దతుగా రైతులు మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అమరావతి టూ అరసవల్లి పాదయాత్ర ఉద్యమంలా ప్రారంభమైంది. ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు పాదయాత్రకు మద్దతు పలికాయి. కానీ ఇందులో ఇప్పుడు బీజేపీ పాత్ర కీలకంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉండడమే ఇందుకు కారణం. ఇప్పటివరకూ బీజేపీ అమరావతి ఏకైక రాజధానికి మద్దతు ఇస్తున్నట్టు చెబుతూ వచ్చింది. అటు కేంద్ర పెద్దగా మాత్రం రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమంటూ ప్రకటిస్తూ వచ్చింది. ఇలా రెండు పడవల మీద కాళ్లు వేస్తూ కాలం వెళ్లదీస్తూ వచ్చింది. బీజేపీ అమరావతికి మద్దతు తెలుపుతున్నా ఆ పార్టీపై ఒక రకమైన భావన రైతుల్లో ఏర్పడింది. అందుకే అమరావతికి మద్దతు తెలిపిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును గతంలో ఓ సారి పాదయాత్రలో రైతులు నిలదీసిన సందర్భాలున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తమను వీధిన పడేశారని రైతులు బీజేపీపై ఓ రకమైన అనుమానంతో ఉన్నారు. ఇటువంటి తరుణంలో బీజేపీ గట్టి స్టాండ్ తీసుకోకుంటే మాత్రం పెద్ద అపవాదును మూటగట్టుకునే అవకాశం ఉంది.

Amaravati- BJP
Amaravati- BJP

గత పాదయాత్రలోనే ఇబ్బందులు..
గత 1000 రోజులుగా అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టారు. అమరావతి టూ తిరుపతి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్నీకావు. పాదయాత్ర చేపట్టినవారికి దారిపొడవునా అన్నిరకాల ఇబ్బందులు పెట్టారు. కనీసం బస లేకుండా చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు రెండోసారి పాదయాత్ర చేస్తామంటే పోలీస్ శాఖ ద్వారా శాంతిభద్రతలను సాకుగాచూపి అడ్డగించడానికి ప్రయత్నించారు. కానీ కోర్టు కలుగజేసుకొని పాదయాత్రకు సుగమం చేసింది. అందుకే ఈ పాదయాత్ర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుదీర్ఘ కాలం అన్ని జిల్లాలు కవరయ్యేలా పాదయాత్రకు రూట్ మ్యాప్ రూపొందించారు. రాజ్యాంగం, చట్టం, న్యాయం ఇలా అన్నిరకాల మద్దతు రైతుల పాదయాత్రకు ఉంది. ఒక్క రాష్ట్ర ప్రభుత్వం తప్ప.. అన్నివర్గాలు, పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.

అండగా నిలిస్తేనే నిలబడేది..
అయితే పాదయాత్రను అడ్డుకుంటారన్న ప్రచారం అయితే ఉంది. ఇప్పటికే మూడు రాజధానులు ఏర్పాటుచేసి తీరుతామని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. అమరావతికి మద్దతు ప్రకటించి.. పాదయాత్రకు సైతం సంఘీభావం ప్రకటించిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాత్ర ఇప్పుడు కీలకంగా మారబోతోంది. పాదయాత్రను సజావుగా సాగించే బాధ్యతలను బీజేపీ భుజానికి ఎత్తుకుంటే మాత్రం శభాష్ అంటారు. లేక రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని పాత డైలాగు వల్లె వేస్తే మాత్రం బీజేపీ అప్రదిష్టను మూటగట్టుకోవడం ఖాయం. ఇప్పటికే రాజధాని వ్యతిరేక పార్టీ జాబితాలో వైసీపీ ఉండగా.. దాని సరసన బీజేపీ చేరే అవకాశం ఉంది.

Amaravati- BJP
Amaravati- BJP

బీజేపీకి పరీక్షా సమయం
అమరావతి రాజధానికి ప్రారంభం నుంచి బీజేపీ మద్దతు ప్రకటించింది. అటు ప్రధాని మోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. పార్లమెంట్ సాక్షిగా అమరావతికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కూడా. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి రైతులపై కుట్రలు తిప్పికొట్టేలా బీజేపీ వ్యవహరిస్తేనే రాష్ట్ర ప్రజలపై ఆ పార్టీకి నమ్మకం కుదురుతుంది. అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వైసీపీ సర్కారు అమరావతి విషయంలో కర్కశంగా వ్యవహరించడానికి వెనుకాడబోదని అనేక సందర్భాలు ఉదాహరణగా ఉన్నాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా బీజేపీ సైలెంట్ గా ఉంటే మాత్రం ప్రజా కోర్టులో నిలబడాల్సి ఉంటుంది. ఇక బీజేపీకి ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే మాత్రం ఇది బీజేపీకి పరీక్షా సమయం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version