Vijay insulted former CM in assembly: రాజకీయాల్లో పదవి శాశ్వతం కాదు , కేవలం నాయకులూ చేసే మంచి పనులు తాలూకు ఫలితం మాత్రమే శాశ్వతం, ఆ ఫలితాల ద్వారా ఏర్పడే మంచి పేరు శాశ్వతం. ఇది చాలా మంది నాయకులూ అర్థం చేసుకోలేదు , అందుకే కాలగర్భంలో కలిసిపోయారు. అధికార మదంతో అహంకారం చూపించడం అసలు కరెక్ట్ కాదు అనేది 2024 ఎన్నికలు ఒకసారి నిరూపించి చూపించింది. ఇప్పుడు రీసెంట్ గా తమిళనాడు ముఖ్యమంత్రి గా ఎన్నికైన విజయ్ కూడా పైన చెప్పిన దారిలోనే నడుస్తున్నాడా?, వయస్సులో పెద్దవారైనా నాయకులకు ఆయన మర్యాద ఇవ్వడం లేదా అంటే అవుననే చెప్తున్నారు విశ్లేషకులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, నేడు తమిళనాడు అసెంబ్లీ లో ఎమ్మెల్యేలుగా ఎంపికైన ప్రతీ ఒక్కరు ప్రమాణస్వీకారం చేశారు. అందులో అన్నా డీఎంకే పార్టీ అధినేత పళని స్వామి కూడా ఉన్నాడు.
అయితే పళని స్వామి ప్రమాణస్వీకారం చేయడానికి ముందుకొచ్చినప్పుడు, తన ఎదురుగా కూర్చున్న ముఖ్యమంత్రి విజయ్ కి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన వారికి తిరిగి నమస్కారం చేయడం సంస్కారం. కానీ విజయ్ పళని స్వామికి నమస్కారం చెయ్యలేదు, దండం పెడితే చిన్న చిరునవ్వుతో సరిపెట్టాడు. ఇదే ఇప్పుడు అన్నా డీఎంకే సపోర్టర్స్ ని తీవ్రమైన అసహనానికి గురయ్యేలా చేస్తోంది. ఇదే అసెంబ్లీ లో తనకు గురువు లాంటి విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత ప్రమాణస్వీకారం చేయడానికి వచ్చినప్పుడు పైకి లేచి మరీ నమస్కారం చేసిన విజయ్, గతం లో తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన పళని స్వామిని ఎందుకు గౌరవించలేదు?, అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా మర్యాద ఇస్తాడు అన్నమాట. ఇదంతా పక్కన పెడితే నేడు విజయ్ మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ , ఆయనకు నమస్కారం చేసి , సన్మానం చేసి వచ్చాడు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ప్రతిపక్ష నేతకు గౌరవం ఇచ్చాడు మంచిగానే ఉంది , కానీ విపక్ష నేత అంటే చిన్న చూపు ఎందుకు?, అంటే AIDMK ప్రధాన ప్రతిపక్షం కాదు కాబట్టి విజయ్ చిన్న చూపు చూస్తున్నాడా?, ఎన్నికల ప్రచారం లో ఆయన పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు , ఇక నుండి తమిళనాడు లో కేవలం రెండు పార్టీల మధ్య మాత్రమే పోటీ ఉంటుంది , ఒకటి DMK కాగా, మరొకటి TVK అని. అంటే విజయ్ హోదా ని బట్టే గౌరవం ఇస్తాడు అన్నమాట , అంటూ సోషల్ మీడియా లో ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే , ఇక రాబోయే రోజుల్లో ఈయన ఎలా ఉంటాడో అని అంటున్నారు నెటిజెన్స్.
