Pawan kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఈరోజు రెండు ఆహ్వానాలు అందాయి. ఒకటి తెలంగాణ నుంచి కాగా.. రెండోది ఏపీ నుంచి.. రెండు రాజకీయ కార్యక్రమాలే కావడం గమనార్హం. జనసేనాని పవన్ కళ్యాణ్ ను తను దసరాకు నిర్వహించే ‘అలయ్ బలయ్ ’ కార్యక్రమానికి గవర్నర్ దత్తాత్రేయ ఆహ్వానించారు. ఇక ఏపీ మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్ తమ కుమారుడు వెంకట్రామ్ వివాహానికి పవన్ ను ఆహ్వానించారు. ఒకే రోజు రెండు ఆహ్వానాల్లో పవన్ దేనికి హాజరవుతారన్నది వేచిచూడాలి.
-అలయ్ బలయ్ కు పవన్ కు దత్తాత్రేయ ఆహ్వానం
‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ను హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె శ్రీమతి బండారు విజయలక్ష్మి సోమవారం ఆహ్వానించారు. దత్తాత్రేయ గత 16ఏళ్లుగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఈ యేడాది అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.దీనికి పవన్ ను ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు.
మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ తమ కుమారుడు వెంకట్రామ్ వివాహానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా ‘తెలుగు భాష కథ’, ‘తెలుగు సంస్కృతి’ పుస్తకాలను పవన్ కల్యాణ్ కి అందచేశారు.