TRS MLAs Poaching Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసు: రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు

TRS MLAs Poaching Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు. తాజాగా కోర్టుకు సమర్పించిన రిపోర్ట్ లోని అంశాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ కుట్ర ఎలా జరిగింది? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేశారు? పోలీసులు చేసిన ప్లాన్ ఏంటన్న విషయంపై కీలక అంశాలు నివేదికలో పొందుపరిచారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసుగా పోలీసులు పేర్కొన్నారు. -రిమాండ్ రిపోర్ట్ లోని కీలక […]

Written By: NARESH, Updated On : October 29, 2022 9:58 am
Follow us on

TRS MLAs Poaching Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు. తాజాగా కోర్టుకు సమర్పించిన రిపోర్ట్ లోని అంశాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ కుట్ర ఎలా జరిగింది? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేశారు? పోలీసులు చేసిన ప్లాన్ ఏంటన్న విషయంపై కీలక అంశాలు నివేదికలో పొందుపరిచారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసుగా పోలీసులు పేర్కొన్నారు.

-రిమాండ్ రిపోర్ట్ లోని కీలక అంశాలు
నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. హాల్ లో రహస్య కెమెరాలు, రోహిత్ రెడ్డి కుర్తా జేబుల్లో రెండు వాయిస్ రికార్డర్లు పెట్టారు ఫాంహౌజ్ హాళ్లో మ.3.05కి రహస్య కెమెరాలను పోలీసులు ఆన్ చేశారు. మధ్యాహ్నం 3.10కి నిందితులతో కలిసి హాళ్లోకి రోహిత్ రెడ్డి వచ్చారు. సా.4.10కి గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతరావు వచ్చారు.

వీళ్లందరూ సుమారు మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చలు జరిపారు. మీటింగ్ పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని సిగ్నల్ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి చెప్పాం.. కొబ్బరినీళ్లు తీసుకురా అని పైలట్ రోహిత్ రెడ్డి అనగానే లోనికి వెళ్లామని పోలీసులు తెలిపారు.

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామన్న సంభాషణ వాయిస్ రికార్డర్లలో నమోదైంది. కర్ణాటక, దిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ ఇలాగే చేశామన్న రామచంద్రభారతి సంభాషణ రికార్డయింది. తుషార్ కు రామచంద్రభారతి ఫోన్ చేసినట్లు వాయిస్ రికార్డర్లు రికార్డ్ చేశాయి.తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ కుమార్ బన్సల్ కు రామచంద్రభారతి ఎస్ఎంఎస్ పంపారు. ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ ను రిమాండ్ నివేదికలో పోలీసులు పొందుపరిచారు.

రామచంద్ర భారతి, నందు వాట్సప్ సంభాషణ స్క్రీన్ షాట్లు పోలీసులు పొందుపరిచారు. 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ “సంతోష్ బీజేపీ” పేరుతో ఉన్న నంబరుకు రామచంద్ర భారతి వాట్సప్ మెసేజ్ పంపించినట్టు స్క్రీన్ షాట్ ను పోలీసులు సాక్ష్యంగా చూపారు. నందు డైరీలో 50 మంది తెరాస, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరాలున్నాయి. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సహకరించేందుకు వెళ్లారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలను పొందుపరిచారు.