Shilpa Chowdary Case: ఆమె కేసులో తేలు కుట్టిన దొంగల్లా టాలీవుడ్ సెలబ్రిటీలు.. కారణం అదే !

Shilpa Chowdary Case: హైదరాబాద్ వేదికగా ఖిలాడీ లేడీ శిల్పా చౌదరి చీటింగ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. శిల్ప మాయమాటలు నమ్మి కోట్లు నష్టపోయిన పరిశ్రమ ప్రముఖులు మిన్నకుండిపోయారు. హై ప్రొఫైల్ వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్న శిల్ప దంపతులు పదేళ్లుగా కిట్టీ పార్టీలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్, సినిమా పరిశ్రమకు చెందిన బడాబాబుల కోడళ్ళు, పిల్లలు, కొందరు సినిమా హీరోలతో వీరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కిట్టీ పార్టీలతో పాటు ఆడవాళ్లకు సపరేట్ […]

Written By: Shiva, Updated On : November 30, 2021 12:06 pm
Follow us on

Shilpa Chowdary Case: హైదరాబాద్ వేదికగా ఖిలాడీ లేడీ శిల్పా చౌదరి చీటింగ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. శిల్ప మాయమాటలు నమ్మి కోట్లు నష్టపోయిన పరిశ్రమ ప్రముఖులు మిన్నకుండిపోయారు. హై ప్రొఫైల్ వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్న శిల్ప దంపతులు పదేళ్లుగా కిట్టీ పార్టీలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్, సినిమా పరిశ్రమకు చెందిన బడాబాబుల కోడళ్ళు, పిల్లలు, కొందరు సినిమా హీరోలతో వీరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Shilpa Chowdary

కిట్టీ పార్టీలతో పాటు ఆడవాళ్లకు సపరేట్ గా స్పా పార్టీలు నిర్వహించేవారు. ఈ పార్టీలలో బిజినెస్ ప్రపోజల్స్ తెరపైకి తెచ్చేవారు. అధిక లాభాలు, వడ్డీలు ఆశ చూపి కోట్ల రూపాయలు వసూలు చేసేవారు. అలా పదుల సంఖ్యలో ప్రముఖుల నుండి వందల కోట్లు వసూలు చేశారు. దివ్యా రెడ్డి అనే ఓ మహిళ ఫిర్యాదుతో వీరి బాగోతం బయటకు వచ్చింది.

దివ్యా రెడ్డి వద్ద కోటి రూపాయలకు పైగా తీసుకున్న శిల్ప, తిరిగి చెల్లించకపోవడంతో పాటు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీనితో ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం శిల్పా చౌదరి పోలీసుల కస్టడీలో ఉండగా.. విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. స్పా పార్టీల వీడియో రికార్డ్స్ దగ్గర పెట్టుకున్న శిల్ప… తిరిగి డబ్బులు అడిగితే వీడియోలు బయటపెడతానని బెదిరించేవారని సమాచారం.

Also Read: IPL Auction: జట్టులో ఉండేదెవరో తేలేది నేడే..!

వీడియోలు బయటికి వస్తే పరువు పోతుందని భావించిన చాలా మంది సెలెబ్రిటీలు ఆమెపై ఫిర్యాదు చేయడానికి సాహసం చేయలేదు. తమ చీకటి జీవితాలు బయటికి వస్తాయని కొందరు ప్రముఖులు తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు. ఆమె దందాలు బయటికి వచ్చాక మరికొందరు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.

అయితే చిత్ర పరిశ్రమ నుండి ఒక్కరు కూడా మోసపోయినట్టు బయటికి రాలేదు. ఆ సెలబ్రిటీలు ఫిర్యాదు చేసే అవకాశం ఉండకపోవచ్చని, పరువు కోసం కోట్లు వదిలేస్తారన్న టాక్ వినిపిస్తుంది. శిల్పా చౌదరి క్రైమ్ ఎపిసోడ్ ఇప్పుడే తెరపైకి రాగా.. ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Also Read:Sirivennela: సిరివెన్నెల ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్​ విడుదల చేసిన వైద్యులు

Tags