Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: పాలి‘ట్రిక్స్‌’.. రాజకీయాల్లో ఎన్ని కేసులుంటే అంత గొప్ప!

Telangana Elections 2023: పాలి‘ట్రిక్స్‌’.. రాజకీయాల్లో ఎన్ని కేసులుంటే అంత గొప్ప!

Telangana Elections 2023: రాజకీయాల్లో కేసులు ఉండడం ఓ క్రెడిట్‌గా ఫీల్‌ అవుతున్నారు నేతలు. కేసులు ఉండడం కూడా రాజకీయాలకు క్వాలిఫికేషన్‌గా మారిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చాలా మందిపై కేసులు ఉండడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్‌పార్టీ 118 స్థానాల్లో పోటీచేస్తుంది. ఈ అభ్యర్థుల్లో 84 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలోని బీజేపీ 111 స్థానాల్లో పోటీచేస్తుంది. ఆ అభ్యర్థుల్లో 78 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ 119 స్థానాల్లో పోటీచేస్తుండగా, వారిలో 58 మంది పై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఇక 12 స్థానాల్లోనే పోటీచేస్తున్న ఎంఐఎంపార్టీలో ఆరుగురిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

ఏళ్లుగా పెండింగ్‌..
కేసులు ఉన్న అభ్యర్థులు అనేకమందిపై ఏండ్ల తరబడి కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీచేస్తున్న 84 మంది అభ్యర్థులపై మొత్తం 540 కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఆపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిపై 89 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 2018 ఎన్నికల సమయంలో రేవంత్‌పై 40కిపైగా కేసులు ఉండగా, ఐదేళ్లలో అతనిపై బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మరో 50కిపైగా కేసులు పెట్టింది. ఇక ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఆపార్టీ అభ్యర్థి వెడ్మా బొజ్జుపై 52 కేసులు ఉన్నాయి. మంచిర్యాల నుంచి పోటీచేస్తున్న కొక్కిరాల ప్రేంసాగర్‌రావుపై 32 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

బీజేపీలో ఆ ముగ్గురిపై
బీజేపీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 78 మందిపై 549 క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నాయి. ఆపార్టీ అభ్యర్థిగా గోషామహల్‌ నుంచి పోటీచేస్తున్న రాజాసింగ్‌పై 89 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత కరీంనగర్‌ నుంచి పోటీచేస్తున్న బండి సంజరుకుమార్‌పై 59 కేసులు, బోథ్‌ నుంచి పోటీచేస్తున్న సోయం బాపూరావుపై 55 కేసులు నమోదై ఉన్నాయి.

బీఆర్‌ఎస్‌లో గంగులపై..
బీఆర్‌ఎస్‌లో కరీంనగర్‌ స్థానం నుంచి పోటీచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌పై అత్యధికంగా పది క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానం గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుపై 9 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ కుమారుడు, రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల అభ్యర్థి కే తారకరామారావుపై 8 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

ఈ క్రిమినల్‌ కేసుల్లో అత్యధికం.. రాజకీయ కేసులే. గడచిన 9 ఏండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలపై పెట్టిన కేసులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. బీఆర్‌ఎస్‌ నేతలపై నమోదైన కేసులు .. ఉద్యమ సమయంలో నమోదైనవి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version