spot_img
Homeజాతీయ వార్తలుBJP- CM KCR: బీజేపీకి శ్రీరంగనీతులు.. కేసీఆర్ పాటించేదేంటో మరీ!

BJP- CM KCR: బీజేపీకి శ్రీరంగనీతులు.. కేసీఆర్ పాటించేదేంటో మరీ!

BJP- CM KCR: తెలంగాణ విడిపోయాక జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీకి కేవలం 3 సీట్లు మాత్రమే ఎక్కువ సంపాదించిన కేసీఆర్ ఆగమాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 63మంది ఎమ్మెల్యేలతో కేసీఆర్ సర్కార్ ఏర్పడింది. మ్యాజిక్ మార్క్ 60 ఎమ్మెల్యేలే. దీంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియని ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ముందుగా బీఎస్పీ తరుఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిచి మరీ మంత్రి పదవులు ఇచ్చి చేర్చుకున్నారు. ఆ తర్వాత టీడీపీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల లాంటి ఎంతో మందిని చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టారు.

BJP- CM KCR
kishan reddy- CM KCR

2014 ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ సీట్లు, కాంగ్రెస్ 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులోని చాలా మందిని లాగేసిన కేసీఆర్ ముందు తన కుర్చీ పదిల పరుచుకున్నారు. వారితో రాజీనామా కూడా చేయించుకుండానే చేర్చుకున్నారు.

ఇక 2019 ఎన్నికల్లోనూ క్లియర్ కట్ గా 80కి పైగా సీట్లు వచ్చినా కూడా కాంగ్రెస్ నుంచి గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. కనీసం రాజీనామా కూడా చేయించుకోలేదు. అంటే కేసీఆర్ చేస్తే అది సంసారం.. ఇప్పుడు బీజేపీ చేస్తే అది వ్యభిచారం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో కేసీఆర్ వైఖరి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. ఈ కేసులో బీజేపీ నేతలపై ఆరోపిస్తూ వీడియోలు ప్రదర్శించిన కేసీఆర్ పై బీజేపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూటిగా ఇదే మాట అన్నారు. అసలు ఎవరో స్వామీజీలను తీసుకొచ్చి చూపించిన ఈ షో ఒక కట్టు కథలా ఉంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశమే లేదు. ఎందుకంటే 90 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయన చెంత ఉన్నారు. వీడియోలోనూ కూలగొడుతామని వాళ్లు చెప్పలేదు. ఇక స్వామీజీలకు ప్రభుత్వాలు పడగొట్టే సామర్థ్యాలున్నాయా?

ఇక కేసీఆర్ ఈ ఆటలో అరటిపండుగా కీలకంగా ఉన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే. టీఆర్ఎస్ లోకి అక్రమంగా వచ్చిన వారే. ఆయనను నీతిమంతుడిగా కేసీఆర్ ప్రొజెక్ట్ చేయడమే ఇక్కడ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. కేసీఆర్ ప్రెస్ మీట్ లో తన పక్కన కూర్చుండబెట్టుకున్న.. ఫాంహౌస్ కొనుగోళ్లలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఇరత పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన వారే. ఒక గువ్వల బాలరాజు మాత్రమే టీఆర్ఎస్ నుంచి గెలిచారు. పక్కపార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను హైజాక్ చేసి బీజేపీ కొంటోందంటున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి నీతులు వళ్లించడాన్ని అందరూ ఎద్దేవా చేస్తున్నారు.

బ్రోకర్ల ద్వారా కాంగ్రెస్ ఇతర పార్టీ నేతలను చేర్పించుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే పనిచేస్తోందంటూ బీజేపీపై ఆడిపోసుకోవడమే విడ్డూరంగా ఉంది. కేసీఆర్ కావాలనే బీఆర్ఎస్ పేరిట వచ్చేందుకు బీజేపీని టార్గెట్ చేశారని అర్థమవుతోంది.

కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎమ్మెల్యేలను కొనాల్సిన ఖర్మ వారికి పట్టలేదు. ఇప్పటికే రెండు స్థానాలు గెలిచింది. ప్రజస్వామ్యయుతంగానే వచ్చేసారి అధికారంలోకి రాగలదు. ఇదే విషయాన్ని అటు కిషన్ రెడ్డి మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజలు చెబుతున్నారు. నాడు టీడీపీ కూడా ఇలానే బీజేపీపై బురదజల్లింది. చంద్రబాబు ఎగిరెగిరి పడి ఇప్పుడు అనుభవిస్తున్నారు.. కేసీఆర్ కు అదే గతి పడుతుందని కిషన్ రెడ్డి హెచ్చరించడం విశేషం. మరి ఆరోజు వస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper