రూట్‌ మార్చిన టీడీపీ.. వర్కవుట్‌ అయ్యేనా..!

సమ్మర్‌‌కు అనుగుణంగానే తిరుపతి ఉప ఎన్నిక కూడా హీట్‌ పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ స్థానాన్ని అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన–బీజేపీ కూటమి ఎప్పటి నుంచో తిరుపతిలోనే మకాం వేశాయి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే.. ఈసారి తిరుపతిలో ఎలాగైనా టీడీపీ జెండా ఎగురవేయాలని ఉవ్విల్లూరుతోంది. ఇందుకు తెగ పోరాడుతోంది. అదే క్రమంలో ఈసారి తన రూట్ కూడా మార్చేసింది. సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ఇన్నాళ్లు బహిరంగ సభలు.. సమావేశాలతో ఎన్నికల […]

Written By: Srinivas, Updated On : April 3, 2021 1:12 pm
Follow us on


సమ్మర్‌‌కు అనుగుణంగానే తిరుపతి ఉప ఎన్నిక కూడా హీట్‌ పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ స్థానాన్ని అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన–బీజేపీ కూటమి ఎప్పటి నుంచో తిరుపతిలోనే మకాం వేశాయి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే.. ఈసారి తిరుపతిలో ఎలాగైనా టీడీపీ జెండా ఎగురవేయాలని ఉవ్విల్లూరుతోంది. ఇందుకు తెగ పోరాడుతోంది. అదే క్రమంలో ఈసారి తన రూట్ కూడా మార్చేసింది. సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది.

ఇన్నాళ్లు బహిరంగ సభలు.. సమావేశాలతో ఎన్నికల ప్రచారాలు చేసిన టీడీపీ.. ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి ప్రతిఒక్కరినీ పలకరించాలని ప్లాన్‌ చేసుకుంది. ప్రచార గడువు ముగిసేలోగా ప్రతి ఇంటికి కనీసం పదిసార్లు వెళ్లేలా ప్లాన్‌ చేసింది. వివిధ అంశాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. గతంలో నిర్వహించిన విధంగా ర్యాలీలు, సభల పేరుతో హడావుడి చేయడం క్షేత్ర స్థాయిలో ఓటర్లను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఓటర్లకు పార్టీ స్టాండ్ వినిపించడంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. బూత్‌ కమిటీ వ్యవస్థను బలోపేతం చేయడంపై పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. అధికార పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వాలంటీర్లు బాగా ఉపయోగపడ్డారని భావించిన టీడీపీ.. దీనికి ప్రత్యమ్నాయంగా బూత్‌ కమిటీ వ్యవస్థను నిర్మించాలని నిశ్చయించింది.

ఎన్నికల ఫలితాల తర్వాత బూత్ కమిటీలు దూకుడు తగ్గించాయి. దీంతో స్థానిక నాయకత్వానికి సహకరించడానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలను రంగంలోకి దింపారు. అందరికీ బాధ్యతలు అప్పగించి.. పది పదిహేను రోజులుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, క్రియాశీలక కార్యకర్తలు ఇలా అందరూ తిరుపతి ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాల వారీగా కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. నెల రోజులుగా అందరూ అక్కడే ఉంటూ పరిస్థితి సమీక్షలతో ముందుకు సాగుతున్నారు. బూత్ కమిటీల సాయంతో ఓటర్లతో మమేకం అవుతున్నారు. డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తూ.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు.

నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి వెంటనే ప్రచారం ప్రారంభించి.. తిరుపతి లోక్‌సభ పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. టీడీపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. టీడీపీ ఈసారి సేవ్ తిరుపతి నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అలాగే ప్రత్యేక హోదా, తిరుపతికి ఇచ్చిన హామీలను హైలైట్ చేస్తోంది. అలాగే పథకాల పేరుతో వాలంటీర్లు బెదిరించే అవకాశం ఉందని.. అలా ఎవరైనా బెదిరిస్తే వారి సమాచారాన్ని పార్టీకి అందించాలని 7557557744 వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నంబర్‌కు కాల్ రికార్డు కానీ, ఫొటో కానీ వాట్సాప్ చేస్తే సంబంధిత వ్యక్తుల అకౌంట్‌లో రూ.10వేలు వేస్తామని ప్రచారం చేస్తున్నారు. ఇలా గతానికి భిన్నంగా టీడీపీ తన ప్రచారంతో దూసుకెళ్తోంది.