Homeజాతీయ వార్తలుYS Sharmila- PM Modi: కేసీఆర్ కు షాక్ లగా.. షర్మిళకు ప్రధాని ఫోన్.. రుమార్ల...

YS Sharmila- PM Modi: కేసీఆర్ కు షాక్ లగా.. షర్మిళకు ప్రధాని ఫోన్.. రుమార్ల వేళ కొత్త ట్విస్ట్

YS Sharmila- PM Modi: వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళకు ఈ రోజు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఉదయం 11 గంటల సమయంలో ఫోన్ చేసిన ప్రధాని సుమారు 10 నిమిషాల పాటు మాట్లాడారు. పలు కీలకాంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. షర్మిళ పాదయాత్రకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులు, ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీసినట్టు సమాచారం. షర్మిళ నుంచి కీలక సమాచారం రాబట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల షర్మిళను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినట్టు వార్తలు వచ్చాయి. గంటల తరబడి రోడ్డుపైనే వాహనంలో ఉండిపోయిన షర్మిళను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో నేరుగా ప్రధాని ఫోన్ చేసి పరామర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు తెలంగాణ పొలిటిక్స్ కు కొత్త సంకేతాలిచ్చినట్టయ్యింది.

YS Sharmila- PM Modi
YS Sharmila- PM Modi

ఇప్పటికే జగన్ వద్ద ప్రధాని మోదీ షర్మిళ గురించి ఆరా తీసినట్టు వార్తలు వచ్చాయి. జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం నిర్వహించిన సన్నాహాక సమావేశానికి జగన్ హాజరయ్యారు. ప్రధాని పలుకరించే క్రమంలో జగన్ వద్ద షర్మిళ విషయం ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మీరెందుకు స్పందించలేదని కూడా ప్రధాని అడిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ జగన్ నుంచి మౌనమే సమధానం వచ్చిందని మీడియాలో కథనాలు సైతం ప్రసారమయ్యాయి. ఈ వార్తలపై ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి స్పందించారు. అదంతా ఎల్లో కుల మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. జగన్ తో ప్రధాని మాట్లాడేటప్పుడు మూడో వ్యక్తి లేరని.. అటువంటప్పుడు ఆ విషయాలు బయటపడే చాన్సే లేదని తేల్చేశారు. 2024 ఎన్నికలతో ఎల్లో కుల మీడియా అవుట్ అని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రధాని నేరుగా షర్మిళకు ఫోన్ చేసేసరికి.. జగన్ తో నిజంగా చర్చించారన్న అనుమానాలకు బలం చేకూరినట్టయ్యింది.

YS Sharmila- PM Modi
YS Sharmila- PM Modi

అయితే తాజా పరిణామాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఢిల్లీలో జరిగిన అత్యున్నత సదస్సుకు సీఎం జగన్, ఇటు విపక్ష నేత చంద్రబాబు హాజరయ్యారు. జగన్ వద్ద షర్మిళ ఇష్యూను ప్రకటించి ప్రధాని ఇరకాటంలో పడేశారన్న టాక్ నడుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ తో బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. అటు జగన్, కేసీఆర్ మంచి స్నేహితులు. అలాగని బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లి కేసీఆర్ తో స్నేహం చేయలేని పరిస్థితి జగన్ ది. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతలా చీలితే అంత తనకు వర్కవుట్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో షర్మిళ బలపడాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే షర్మిళకు హైప్ పెంచాలన్న ఉద్దేశ్యంతో ఆమెను అరెస్ట్ చేశారన్న ప్రచారమూ ఉంది. ఇవన్నీ గుర్తెరిగే ప్రధాని అటు జగన్ ను, ఇటు కేసీఆర్ ను దెబ్బకొట్టేందుకే నేరుగా షర్మిళకు ఫోన్ చేసి ఓదార్చారన్న టాక్ పొలిటికల్ సర్కిల్ లో నడుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version