spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Shock For Ippatam Villagers: ఇప్పటం రైతులకే లక్ష జరిమానా విధిస్తే.. ఏపీ ప్రభుత్వానికి ఎంత...

Shock For Ippatam Villagers: ఇప్పటం రైతులకే లక్ష జరిమానా విధిస్తే.. ఏపీ ప్రభుత్వానికి ఎంత వేసినా తక్కువే

Shock For Ippatam Villagers: రాజకీయ కక్షలకు ఇప్పటం గ్రామస్థులు బలయ్యారు. కేవలం జనసేన ఆవిర్భావ సభకు స్థలాలిచ్చారని రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చేశారు. నాడు ప్రభుత్వ పెద్దల మాటలు పెడచెవిన పెట్టారన్న కారణం చూపి రకరకాలుగా హింసించబడుతున్నారు.వారిపై ఏపీ సమాజం మొత్తం సానుభూతితో ఉన్నా వారికి స్వాంతన చేకూర్చలేకపోతున్నారు. ఇప్పుడు కోర్టులో మరోసారి బాధితులుగా మిగిలారు ఇప్పటం గ్రామస్థులు. కూల్చివేతకు సంబంధించి నోటీసులిచ్చినా.. ఇవ్వలేదని కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఒక్కో రైతుకు రూ.లక్ష చొప్పున కోర్టు జరిమానా విధించింది. 14 మంది రైతులు రూ.14 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంది. అయితే రైతులు చేసినది ముమ్మాటికీ తప్పే. దానిని ఎవరూ కాదనలేరు. కానీ ప్రభుత్వ తప్పుదోవ పట్టిస్తున్న కేసుల సంగతేంటి? అన్న వాదన ఇప్పుడు తెరపైకి వస్తోంది. ప్రతిరోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు దాఖలవుతున్నాయి. కొన్ని కేసులు వాదనలకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏ కేసుకూ సరైన వివరాలు అందించడం లేదు సరికదా తప్పుదోవ పట్టిస్తున్నవే అధికం. మరి ఈ లెక్కన ప్రభుత్వానికి ఇంకెంత శిక్షవేయాలి?

Shock For Ippatam Villagers
ap high court

పోనీ కోర్టు కేసులు అమలవుతున్నాయా అంటే అదీ లేదు. ఏడాదిలో వేలాదిగా ధిక్కరణ పిటీషన్లు దాఖలవుతున్నాయి. ఏ కేసును పరిశీలించినా ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వడం లేదు. చివరకు విశాఖలో రుషికొండ కేసునే తీసుకుందా. కొండను పూర్తిగా తొలగించినా.. అందుకు తగ్గ వివరాలు కోర్టుకు అందించలేదంటే దానిని ఏమనాలి? ఈ కేసు విషయంలో ప్రభుత్వం కోర్టుకు ఎన్నిసార్లు తప్పుదోవ పట్టించిందో చెప్పనక్కర్లేదు. అటు అక్కడ పనులు చేస్తూనే మరోవైపు.. ఇప్పటికీ కోర్టుకు అదే చెబుతూ కాలం వెళ్లదీస్తోంది. ఇప్పటివరకూ ఫలానా కేసులో సవ్యంగా వివరాలు అందించందంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. అయినా పారా హుషార్ గా ప్రభుత్వం ఉంది. కోర్టుకు చెప్పకుండా ఎన్నో దురాగతాలకు పాల్పడింది. మరెన్నో వాస్తవాలను మరుగున పరచింది. వాటితో పోలిస్తే మాత్రం ఇప్పటం గ్రామస్థులు చేసినది పొరపాటు మాత్రమే. అందులో అవగాహన లోపమే ఎక్కువగా కనిపిస్తోంది.

Shock For Ippatam Villagers
ap high court

ఒక వైపు కళ్లెదుటే కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తుండడం చూసి కన్నీరు పెట్టుకోవడం తప్ప.. వారేమీ చేయలేకపోయారు. న్యాయస్థానానికి వెళితే తమకు న్యాయం జరుగుతుందని ఆశించారు. నోటీసులిచ్చారని చెబితే ఎక్కడ న్యాయస్థానం జోక్యం చేసుకోదో అని భావించారు. అది తప్పు అని తెలిసినా తప్పనిసరి అయి చేశారు. అయితే కోర్టు ఆదేశాలిచ్చినా కూల్చివేతలు ఆగలేదు. కోర్టు ఆర్డర్ వచ్చిన తరువాత కూడా అవి కొనసాగాయి. అటు జరగాల్సిన నష్టం జరిగిపోగా.. ఇప్పుడు కొత్తగా కోర్టును తప్పుదోవ పట్టించారన్న అపవాదును ఇప్పటం రైతులు మూటగట్టుకున్నారు. రూ.లక్ష జరిమానాకు బాధ్యులయ్యారు. అధికారంలో ఉన్నవారు అంతులేని అధికార దాహంతో విర్రవీగితే బాధితులకు గుర్తుచ్చేది న్యాయస్థానాలే. ఇప్పుడు అవే న్యాయస్థానాలు జరిమానా రూపంలో బాధితులను భయపడుతుంటే .. ఇక వారికి దిక్కెవరు? అన్యాయం జరిగిందని అదే న్యాయస్థానాన్ని ఆశ్రయించేదెవరు?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper