గాడ్సేపై మరో రెండు పోస్టులు వైరల్!

నటుడు నాగబాబు ఇటీవల నాథురామ్ గాడ్సే పై వరస ట్వీట్లు చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే… ఈ ఘటన ఇంకా ప్రజలలో నలుగుతున్న తరుణంలోనే గాడ్సే పై మరో రెండు ట్వీట్లు వైరల్ గా మారాయి. రూ.10 కరెన్సీ నోటుపై మహాత్మాగాంధీ బొమ్మ స్థానంలో నాథురామ్ గాడ్సే బొమ్మను క్లోన్‌ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌ లో చోటుచేసుకుంది. అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)తో సంబంధమున్న సిధి జిల్లాకు చెందిన శివమ్‌ శుక్లా మే 19న గాడ్సే 111 వ […]

Written By: Neelambaram, Updated On : May 25, 2020 5:15 pm
Follow us on

నటుడు నాగబాబు ఇటీవల నాథురామ్ గాడ్సే పై వరస ట్వీట్లు చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే… ఈ ఘటన ఇంకా ప్రజలలో నలుగుతున్న తరుణంలోనే గాడ్సే పై మరో రెండు ట్వీట్లు వైరల్ గా మారాయి.

రూ.10 కరెన్సీ నోటుపై మహాత్మాగాంధీ బొమ్మ స్థానంలో నాథురామ్ గాడ్సే బొమ్మను క్లోన్‌ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌ లో చోటుచేసుకుంది. అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)తో సంబంధమున్న సిధి జిల్లాకు చెందిన శివమ్‌ శుక్లా మే 19న గాడ్సే 111 వ జయంతిని పురస్కరించుకొని ‘లాంగ్ లివ్ నాథురామ్ గాడ్సే’ అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న మధ్యప్రదేశ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరో పోస్ట్‌ లో.. రఘుపతి రాఘవ రాజా రామ్‌, దేశ్‌ బచ్చా గే నాథూరాం’ (నాథూరాం దేశాన్ని రక్షించారు) అని పేర్కొన్నారు. అదే పోస్ట్‌ లో ‘శుక్లా గాడ్సేను మహాత్మా’ అని సంభోదించి.. ‘పూజ్య పండిట్‌ నాథూరాం గాడ్సే అమర్‌ రహీన్‌’ అంటూ పోస్ట్‌ చేశారు.

ఇదే విషయంపై నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఎన్‌ఎస్‌యూఐ) కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం శుక్లాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు శుక్లాను గుర్తించడానికి సైబర్‌ నిపుణుల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ఏబీవీపీ.. సంబంధం లేని విషయాల్లో తమ పేరును తప్పుగా వాడుతున్నట్లు కాంగ్రెస్‌ పై ఫిర్యాదు చేసింది.