Homeజాతీయ వార్తలుPM Modi Diwali Celebrates: పాకిస్తాన్ పై నెక్ట్స్ రౌండ్.. మోదీ దీపావళి సందేశం...

PM Modi Diwali Celebrates: పాకిస్తాన్ పై నెక్ట్స్ రౌండ్.. మోదీ దీపావళి సందేశం అదే

PM Modi Diwali Celebrates: ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి ప్రతి సంవత్సరం దీపావళి పండుగను సరిహద్దు ప్రాంతాల్లో సైనికులతో కలసి జరుపుకోవడం ఒక ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. సియాచిన్‌ హిమనదిలో ప్రారంభమైన ఈ పండు వివిధ సరిహద్దు ప్రాంతాల వరకూ విస్తరించింది. ఈ ఏడాది ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో దీపావళి జరుపుకున్నారు. ఇది ఆయన దేశ భద్రతా దృక్కోణాన్ని మరింత ప్రతిబింబించింది.

గోవా నుంచి భద్రతా సంకేతం
గోవా తీరంలో నావల సింహగర్జన మధ్య దీపావళి జరుపుకోవడం కేవలం పండగ సెంటిమెంట్‌ మాత్రమే కాదు, భారత నౌకాదళ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించడమే ప్రధాన ఉద్దేశం. దేశీయ సాంకేతికతపై ఆధారపడి నిర్మించుకున్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సముద్ర రక్షణలో భారత స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తోంది. ఇది భారత సముద్రగర్భ వ్యూహాత్మక విస్తరణకు సాంబోధన.

నేవీ ప్రాధాన్యతపై వ్యూహాత్మక సంకేతాలు
ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో గత యుద్ధాలలో వాయుసేన, భూసేన ప్రత్యేక పాత్ర పోషించగా, సముద్రరంగం రెండో ప్రాధాన్య స్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో దీపావళి వేడుకలు జరపడం ద్వారా మోదీ, భవిష్యత్‌ ఆపరేషన్లలో నౌకాదళం కీలక శక్తిగా ముందుకు వస్తుందని సూచించారు. ఈ చర్య భారత సముద్రతీర భద్రత అనే అంశాన్ని జాతీయ రక్షణ వ్యూహంలో మరింత ముందుకు తెచ్చింది.

పాకిస్తాన్‌కు స్ఫుటమైన హెచ్చరిక
మోదీ చేసిన వ్యాఖ్యల్లోని మూల సందేశం పాకిస్తాన్‌పై స్పష్టంగా కేంద్రీకృతమైంది. పస్ని, కరాచీ వంటి పరిమిత నౌకా స్థావరాలతో పాకిస్తాన్‌ భద్రతా వ్యవస్థ సున్నితంగా ఉందని ఆయన వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు. 1971 యుద్ధంలో భారత నేవీ కరాచీ పోర్ట్‌ను దిగ్బంధనం చేసి పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన సంఘటనతో పోలుస్తూ, భవిష్యత్తులో అదే విధమైన చర్యలు అవసరమైతే దేశం సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చారు. ఇది కేవలం రాజకీయ వ్యాఖ్య కాదు.. సముద్ర భద్రతలో భారత ఆధిపత్యాన్ని స్పష్టంగా తెలియజేసే వ్యూహాత్మక సమాచారం.

యుద్ధరంగ దిశలో కీలక మార్పు..
మోదీ చేసిన ఈ పర్యటన భవిష్యత్‌ రక్షణ దిశలను సూచిస్తోంది. భారత సాయుధ బలగాల మధ్య సమన్వయం, సముద్ర నియంత్రణ, వాయు–ఆర్మీ వ్యూహం వంటి అంశాలు ఇప్పుడు ఒక సమగ్ర బలగ రూపకల్పనలో భాగమవుతున్నాయి. నేవీకి ఎక్కువ బాధ్యతలు అప్పగించటం ద్వారా, ప్రభుత్వం సముద్రరంగాన్ని సెక్యూరిటీ కేంద్రంగా మలుస్తోంది.

దీపావళి వంటి పర్వదినాన్ని యుద్ధ నౌకపై జరపడం ప్రజలకు ఒక శక్తివంతమైన స్మరణ. దేశ భద్రత, సైనికుల త్యాగం, మరియు స్వదేశీ సాంకేతిక శక్తిపై గర్వ భావనను పునరుద్ఘాటించడమే ఈ సందేశం యొక్క అసలు ఉద్దేశ్యం. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ‘‘తేలియాడే నగరం’’గా పేర్కొనడం, ఆ స్వావలంబన భావానికి ప్రతీక.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version