Pawan Kalyan’s ‘Khushi’ movie : ‘ఖుషి’ స్పెషల్ షోస్ పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు.. షోస్ రద్దు!

Pawan Kalyan’s ‘Khushi’ movie : ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు అంటూ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే.. రాజకీయాలు చేస్తూ సినిమాలు చేసే ఆయనకీ ప్రభుత్వం నుండి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది.. ఇప్పటికే పవన్ సినిమాల మీద జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. అవి మరిచిపోకముందే మరోసారి ఆయన రిమేక్ సినిమాపై […]

Written By: NARESH, Updated On : December 30, 2022 10:05 pm
Follow us on

Pawan Kalyan’s ‘Khushi’ movie : ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు అంటూ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే.. రాజకీయాలు చేస్తూ సినిమాలు చేసే ఆయనకీ ప్రభుత్వం నుండి ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది.. ఇప్పటికే పవన్ సినిమాల మీద జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. అవి మరిచిపోకముందే మరోసారి ఆయన రిమేక్ సినిమాపై కూడా ప్రతీకారం మొదలుపెట్టింది. వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్.. ఈ రెండు చిత్రాలకు టికెట్ రేట్స్ విషయం లో ప్రభుత్వం ఎంత నిరంకుశంగా వ్యవహరించిందో మనం చూసాము. ఇప్పుడు రీరిలీజ్ అవుతున్న ‘ఖుషీ’ మూవీ విషయంలోనే అలానే వ్యవహరిస్తోంది.

కొత్త సినిమాలని ఎలాగో ప్రభుత్వం తొక్కుతుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు..కానీ రీ రిలీజ్ అవుతున్న సినిమాల మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తారని ఎవరు ఊహించలేదు. రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రీ రిలీజ్ అవ్వబోతున్న పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ఖుషి’ ని కూడా ప్రభుత్వం టార్గెట్ చేసింది.

భీమవరం లో ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ షోస్ ని తెల్లవారుజామున 8 గంటల నుండి ప్రారంభించారు.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అయిపోయాయి.. టికెట్స్ అన్నీ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి..కానీ ఆ ప్రాంత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆ స్పెషల్ షోస్ అన్నిటిని రద్దు చేయించాడట..ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

స్పెషల్ షోస్ మీద కూడా ఇలాంటి కక్ష సాధిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత భయమో అని అభిమానులు సోషల్ మీడియా లో ఆడిపోసుకుంటున్నారు. భీమవరం లో ఇలాంటి చర్యలు గతం లో చాలానే జరిపించాడు గ్రంథి శ్రీనివాస్..ఒకప్పుడు ఈ ప్రాంతంలో ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే..ఆ గొడవలు జరగడానికి కారణం కూడా గ్రంథి శ్రీనివాస్ అని అందరూ అంటూ ఉంటారు.ఇప్పుడు మరోసారి పవన్ పై గ్రంథి ప్రతీకారం తీర్చుకుంటున్నారు.