Homeఆంధ్రప్రదేశ్‌వారిపై బదులు తీర్చుకోవడమే నిమ్మగడ్డ టార్గెటా..?

వారిపై బదులు తీర్చుకోవడమే నిమ్మగడ్డ టార్గెటా..?

Nimmagadda Ramesh Kumar
పంచాయతీ ఎన్నికలపై ఎంతో సీరియస్‌గా ఉన్న ఏపీ ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే పలువురు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పలువురు అధికారులను సైతం ట్రాన్స్‌ఫర్‌‌ చేసేసింది. అయితే.. ఈ ట్రాన్స్‌ఫర్లలో భాగంగా ఇద్దరు ఉన్నతాధికారులకు సైతం బదిలీ అప్పదని అందరూ అనుకున్నారు. కానీ.. చివరి నిమిషంలో తిరస్కరించారు. ఇందుకు కారణాలపై ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: వెంకన్న సాక్షిగా నేతల్లో వణుకు

పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్ లపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా కాలం నుంచి గుర్రుగా ఉన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో ప్రభుత్వం ఆ ఇద్దరు అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి వారికి ఉద్యోగ పరంగా రక్షణ కల్పించేందుకే ప్రభుత్వం ముందుగా బదిలీ చేసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేదీ అంటేనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మండి పడుతున్నారు. తనకు సహకారం అందించకుండా ఆయన ముప్పు తిప్పలు పెట్టారని భావిస్తున్నారు. అందుకే ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసే సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఇద్దరు అధికారులపై తన ఆగ్రహాన్ని బహిరంగంగానే వెల్లగక్కారు. వారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఓటర్ల జాబితా సవరణను చేయకపోవడం, ఓటర్ల జాబితాను రూపొందించకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించి, ప్రభుత్వానికి అనుకూలంగా సహకరించారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ బలంగా విశ్వసిస్తున్నారు.

Also Read: తప్పులో కాలేసిన ‘నిమ్మగడ్డ’

ఈ నేపథ్యంలో వారిద్దరిపై చర్యలు తప్పవని అందరూ అనుకున్నారు. అయితే ప్రభుత్వం తెలివిగా వారిద్దరినీ వేరే శాఖకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పుపట్టారు. వాస్తవానికి వారిద్దరిని తప్పించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరాల్సి ఉంది. అయితే చర్యలు తీసుకోవడానికే ప్రభుత్వానికి సిఫార్సు చేయలేదంటున్నారు. మొత్తం మీద నిమ్మగడ్డకు ఏ కోణంలోనూ అవకాశం ఇవ్వకుండా.. ప్రభుత్వమే ఆ తంతు ముగించేసింది. వారిపై చర్యలు తీసుకునేంత వరకూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఊరుకునేట్లు లేరు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version