ఆ అధికారులపై నిమ్మగడ్డ మళ్లీ సీరియస్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల వార్‌‌ నడుస్తోంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. ఇక రెండో విడత నామినేషన్లను ఆన్‌లైన్‌ ప్రక్రియలో తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆ నిర్ణయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయం ఇప్పుడు ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌‌ను ఆగ్రహానికి గురిచేసింది. ఆయన గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్‌లను మరోసారి ఆఫీసుకు రావాలని ఆదేశించారు. ఆన్‌లైన్ నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించినప్పటికీ.. ఎందుకు అమలు చేయలేదో వచ్చి వివరణ ఇవ్వాలని […]

Written By: Srinivas, Updated On : February 1, 2021 5:10 pm
Follow us on

ఏపీలో పంచాయతీ ఎన్నికల వార్‌‌ నడుస్తోంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. ఇక రెండో విడత నామినేషన్లను ఆన్‌లైన్‌ ప్రక్రియలో తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆ నిర్ణయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయం ఇప్పుడు ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌‌ను ఆగ్రహానికి గురిచేసింది. ఆయన గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్‌లను మరోసారి ఆఫీసుకు రావాలని ఆదేశించారు. ఆన్‌లైన్ నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించినప్పటికీ.. ఎందుకు అమలు చేయలేదో వచ్చి వివరణ ఇవ్వాలని ప్రత్యేకంగా నిమ్మగడ్డ లేఖ రాశారు.

Also Read: జగన్‌ ప్రభుత్వానికి సుప్రీం మొట్టికాయలు

ఆన్‌లైన్ నామినేషన్లను ఆమోదించాలని.. పలు రాజకీయ పక్షాలు కోరాయని నిమ్మగడ్డ లేఖలో గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని విపక్షాలు ఇప్పటికే ఆరోపించాయి. అధికార బలం.. పోలీసులు, అధికారులు పక్షపాతంగా వ్యవహరించడం వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగడంతో విపక్ష పార్టీలు పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడిందని అంటున్నాయి.

Also Read: ఆ బృహత్తర కార్యక్రమానికి ఏడాది..

అందుకే.. దీనికి ఎన్నికల సంఘం సొల్యూషన్‌ ఆలోచించింది. ప్రధానంగా ఆన్‌లైన్ నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించాలని ఎస్ఈసీని విపక్ష పార్టీలందరూ కోరగా.. ఒక్క వైసీపీ మాత్రం వ్యతిరేకించింది. ఆన్‌లైన్‌లో అయితే ఎవరైనా ధైర్యంగా నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. అందుకే.. మొదటి విడత సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనలను చూపించి ఆన్‌లైన్ నామినేషన్ విధానం తేవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

మరోవైపు.. ఏకగ్రీవాల విషయంలోనూ ఎస్ఈసీ కూడా అంత సంతృప్తికరంగా లేరు. బలవంతంగా దాడులు, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకునే పద్ధతిని సహించేది లేదని అంటున్నారు. ఇంకా మూడు విడతల నామినేషన్లను స్వీకరించాల్సి ఉంది. రెండో విడతలో కూడా ఇలా నామినేషన్లు వేయనివ్వని పరిస్థితి ఉండకూడదంటే ఆన్‌లైన్ నామినేషన్లకు ప్రాధాన్యత ఇచ్చేఅవకాశం ఉంది. అయితే ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆ సంస్కరణ తీసుకురావడానికి అధికారులు సంశయిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఎన్నికలు ముగిసే సరికి ఇంకా ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుందోనని ప్రభుత్వంలో ఆందోళన మాత్రం కనిపిస్తోంది.