spot_img
Homeఆంధ్రప్రదేశ్‌చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం..!

చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం..!

Chandrababu Naidu
అమరావతి విషయంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పటడుగులు వేసిన చంద్రబాబు ఇప్పడు విశాఖకు రాజధాని తరలింపును అడ్డుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ తంటాల్లో ఒకటి కేంద్రం సహకారం కోరడం. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం అనంతరం వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి నుంచి రాజధానిని తరలించే అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. కేంద్రం సాయంతో రాజధానిని తరలింపును అడ్డుకోవాలన్న చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Also Read: జగన్ పై గురి పెట్టిన ఎంపీ రఘురామ..!

చంద్రబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించిన మరుసటి రోజే కేంద్రం రాష్ట్ర రాజధాని విషయంలో తన వైఖరిని వెల్లడించింది. రాజధాని తరలింపు కేసులో హై కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన కేంద్రం రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదని, ఇధి పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశమేనని లిఖిత పూర్వకంగా తేల్చి చెప్పింది. దీంతో చంద్రబాబు ఆశలను కేంద్రం అడియాశలు చేసినట్లయ్యింది. ఇన్నాళ్లు బీజేపీలోని తన వర్గం నాయకులతో రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని, అమరావతి తరలింపును అడ్డుకుంటుందని ప్రకటనలు చేయించిన చంద్రబాబు వ్యూహం కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ తో బయట పడిందని ఇప్పడు చంద్రబాబు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: మరో వివాదంలోకి ఎస్వీబీసీ..!

ఇక అమరావతిని తన బ్రాండ్ గా చేసుకున్న చంద్రబాబుకు చివరి న్యాయ పోరాటం తప్ప మరో మార్గం లేదు. ఇప్పటికే రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు తదితర అంశాలపై పలువురితో టిడిపి హై కోర్టు, సుప్రీం కోర్టులలో పిటీషన్ లు దాఖలు చేయించింది. న్యాయ పోరాటంతో నైనా అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అంత తేలిగ్గా తీసుకోలేదు. న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలపై నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజధాని తరలింపునకు న్యాయ పరంగా ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలపై అన్వేషణపై చర్యలు ప్రభుత్వం చేపట్టింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version