Homeఅంతర్జాతీయంWork from home in 40 countries: మోడీ చెప్పారని తిట్టుకుంటున్నాం కదా.. 40 దేశాల్లో...

Work from home in 40 countries: మోడీ చెప్పారని తిట్టుకుంటున్నాం కదా.. 40 దేశాల్లో ఇదే పరిస్థితి..

Work from home in 40 countries: ఒక ఏడాది పాటు ఖర్చులు తగ్గించుకోండి. బంగారం కొనుగోలు చేయకండి. విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బులు వెచ్చించకండి.. ఇటీవల హైదరాబాద్ సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు ఇది. సహజంగానే ప్రధానమంత్రి పిలుపునకు వక్రీకరణలు చేసేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా అదే పని చేసింది.. వాస్తవానికి పొదుపు అనేది మన జీవితంలో ఒక భాగం అయితే అది చాలా బాగుంటుంది.. ఉదాహరణకు మనకు జ్వరం వస్తే డాక్టర్ మాంసాహారం తినవద్దని చెబుతుంటారు. దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని డాక్టర్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తారు. దానిని మనం సానుకూలంగా తీసుకోవాలి. అంతేతప్ప వ్యతిరేకంగా తీసుకుంటే మన ఆరోగ్యమే పాడవుతుంది. ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ పరోక్షంగా చెప్పారు. దేశ ప్రధాని సూచించిన పొదుపు మంత్రాన్ని మనలో చాలామంది వ్యతిరేకంగా చూస్తున్నారు గాని.. మన మాదిరిగానే ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నాయి.

పచ్చిమాసియా సంక్షోభం ఇప్పుడు ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతోంది. అయితే దీని నుంచి తేరుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలు పొదుపు చర్యలను పాటిస్తున్నాయి.. ఇంతకీ ఆ జాబితాలో ఎటువంటి దేశాలు ఉన్నాయంటే.

మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, పెరూ వంటి దేశాలు పాఠశాలలకు సంబంధించిన పని దినాలను పూర్తిగా తగ్గించాయి. రిమోట్ లెర్నింగ్ విధానాన్ని పెంచేశాయి.. శ్రీలంకలో అయితే బుధవారాలలో కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నారు. జోర్డాన్, పాకిస్తాన్ దేశాలలో ప్రభుత్వ అధికారులకు సంబంధించిన అంతర్జాతీయ ప్రయాణాలను పూర్తిగా నిషేధించాయి. విదేశాలకు సంబంధించిన ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడాన్ని జోర్డాన్ పూర్తిగా తగ్గించింది. ప్రభుత్వ భవనాలలో ఏసీల వినియోగాన్ని కూడా తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్లో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, మసీద్ ప్రాంతాలలో ఏసీల వినియోగాన్ని కనీసం 25° లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీలంక, మలేషియా, థాయిలాండ్ ప్రాంతాలలో కూడా ఇటువంటి ఆదేశాలు అమలులో ఉన్నాయి.

ఆస్ట్రేలియాలో ఎవరీ లిటిల్ బీట్ హెల్ప్స్ ప్రచారం మొదలైంది. ఇది ఇంధన వీడియో గాని స్వచ్ఛందంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది.

బ్రిటన్ దేశంలో చిన్న చిన్న వ్యాపారులు ఎలక్ట్రిక్ హీటింగ్ విధానానికి మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికోసం ఆర్థిక సహాయం పొందడానికి బాయిలర్ ఆఫ్ గ్రేడ్ పథకాన్ని ఇటీవల మొదలుపెట్టారు.. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి శ్రీలంక ప్రభుత్వం బిల్ బోర్డులపై లైట్లు ఆపివేస్తోంది. ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ దేశాలలో ప్రభుత్వ అధికారులకు నాలుగు రోజుల పని దినాలు అమలులో ఉన్నాయి. ఇందులో 50% రిమోట్ వర్క్ విధానాన్ని అక్కడి ప్రభుత్వాలు అందుబాటులో తీసుకొచ్చాయి. ఇండోనేషియాలో ప్రభుత్వ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు శుక్రవారం ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు.. మయన్మార్ దేశంలో బుధవారం రిమోట్ వర్క్ విధానం అమలులో ఉంది. వియత్నాం కూడా ఇదే విధానాన్ని అమలు చేసే పనిలో ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular