
భారత్ ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా నుండి వైదొలగాలని భావిస్తున్నట్లు తేలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నేత మోడీ. ప్రస్తుతం మోడీకి ఫేస్ బుక్ లో 4కోట్ల 40లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. ట్విటర్ లో 5కోట్ల 33లక్షల మంది, ఇన్ స్ట్రాగ్రామ్ లో 3కోట్ల 50లక్షల 20వేల మంది మోడీని ఫాలో అవుతున్నారు.
అయితే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ వంటి అన్ని సోషల్ మీడియా నుండి ఆయన వైదొలగుతున్నట్లు ట్వీట్ చేశారు. వచ్చే ఆదివారం నుంచి ఆయన సోషల్ మీడియా నుండి తప్పుకుంటున్నట్లు పెట్టిన ట్వీట్ చూసిన ఫాలోయర్స్, అభిమానుల ఆశ్చర్యానికి గురౌతున్నారు.