Raghunandan Rao: బాలికపై గ్యాంగ్ రేప్ కేసు: సంచలన వీడియో బయటపెట్టిన రఘునందన్ రావు

Raghunandan Rao: హైదరాబాద్ లో అమ్మేషియా పబ్ కేసులో పెద్ద వికెట్ పడిపోయింది. పోలీసులు చెబుతున్నట్టు ఎమ్మెల్యే కొడుకు లేడన్నది అవాస్తవాలు అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆధారాలు బయటపెట్టారు. ఆయన తాజాగా గ్యాంగ్ రేప్ కేసులో సంచలన ఫొటోలు, వీడియోలు బయటపెట్టారు. అమ్మాయికి ముద్దు పెడుతున్న యువకుడు ఎమ్మెల్యే కొడుకు కాదా? అని ఫొటోలు బయటపెట్టారు. అనంతరం మెర్సిడేజ్ కారులో గ్యాంగ్ రేప్ నకు ముందు తీసుకున్న వీడియోను బయటపెట్టి సంచలనం సృష్టించారు. […]

Written By: NARESH, Updated On : June 4, 2022 2:41 pm
Follow us on

Raghunandan Rao: హైదరాబాద్ లో అమ్మేషియా పబ్ కేసులో పెద్ద వికెట్ పడిపోయింది. పోలీసులు చెబుతున్నట్టు ఎమ్మెల్యే కొడుకు లేడన్నది అవాస్తవాలు అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆధారాలు బయటపెట్టారు. ఆయన తాజాగా గ్యాంగ్ రేప్ కేసులో సంచలన ఫొటోలు, వీడియోలు బయటపెట్టారు. అమ్మాయికి ముద్దు పెడుతున్న యువకుడు ఎమ్మెల్యే కొడుకు కాదా? అని ఫొటోలు బయటపెట్టారు. అనంతరం మెర్సిడేజ్ కారులో గ్యాంగ్ రేప్ నకు ముందు తీసుకున్న వీడియోను బయటపెట్టి సంచలనం సృష్టించారు.

గ్యాంగ్ రేప్ కేసులో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని రఘునందన్ రావు బయటపెట్టారు. పోలీసులు నిందితుల వైపా? బాధితుల వైపా? అన్నది తేల్చుకోవాలని స్పష్టం చేశారు. పోలీసులు తప్పు చేసిన వారిని భయపెట్టండని.. విచారణ పూర్తికాకముందే కొందరికీ క్లీన్ చీట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిందితుల ఫొటోలను ఎందుకు సీక్రెట్ గా ఉంచుతారని ప్రశ్నించారు.

గ్యాంగ్ రేప్ జరిగిన కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని.. అయినా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసుల విచారణపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. కారులో జరిగిన ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని.. కానీ లిమిటేషన్ దృష్ట్యా ప్రపంచానికి చూపించడం లేదని రఘునందన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మాయి ఫొటో కనిపించకుండా ఓ వీడియోను, కొన్ని ఫొటోలను రఘునందన్ రావు ప్రదర్శించారు. ఈ ఫొటోలో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు కాదా? అని ప్రశ్నించారు.

ఈ ఆధారాలు పోలీసులు, న్యాయస్థానాలకు అందజేస్తామని.. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఈ కేసు విచారణ చేయించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మైనర్ పై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు అసలు నిందితులను వదిలి వెనుకాల ఇన్నోవాలో ప్రయాణిస్తున్న వారిని నిందితులుగా చేర్చారని రఘునందన్ ఆరోపించారు. ఎంఐఎం వాళ్లను టచ్ చేయరని అన్నారు. రెడ్ కలర్ మెర్సిడేజ్ కారులో ఉన్న వ్యక్తులను నిందితులుగా చేర్చకుండా వదిలేయడం బాధాకరమన్నారు.

గ్యాంగ్ రేప్ కేసులో పెద్దపెద్ద వాళ్ల పిల్లలు ఉన్నారని.. అందుకే దీన్ని దాచేస్తున్నారని రఘునందన్ రావు అన్నారు. ఈ వీడియోలను బయటపెట్టి సంచలనం సృష్టించారు. మంత్రి కేటీఆర్ ను ఇప్పుడు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Recommended Videos:

Tags