Maharashtra News: మహారాష్ర్టలో దారుణం చోటుచేసుకుంది. ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు 400 మంది లైంగిక దాడికి పాల్పడిన ఘటన జరగం ఆందోళన కలిగిస్తోంది. మనం నాగరికత ప్రపంచంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో బతుకుతున్నామా అర్థం కావడం లేదు. ముక్కుపచ్చలారని బాలికపై ఇంత మంది అత్యాచారం చేయడం ఘోరం. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటుంటేనే వారి కర్కశం బయటపడుతోంది.
మహారాష్ర్టలోని బీద్ జిల్లాలోని అంబజోగై ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. రెండేళ్ల క్రితం తల్లి మరణించడంతో దిక్కుతోచని స్థితిలో బాలికకు తండ్రి వివాహం చేశాడు. అయితే వివాహం అనంతరం అత్తవారింట్లో మామ వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటింకి తిరిగొచ్చింది.
తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నించగా ఓ అకాడమీలో ఉద్యోగం ఉందని ఇద్దరు వ్యక్తులు నమ్మించి ఆమెపై అత్యాచారం చేశారు. తరువాత ఆమెపై 400 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇదే సమయంలో ఓ పోలీసు కూడా న్యాయం చేస్తామని నమ్మించి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె భవిష్యత్ అంధకారంగా మారింది.
ఈ మేరకు ఈ కేసు శిశు సంక్షేమ శాఖకు చేరింది. అత్యాచారానికి పాల్పడిన తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బాలిక గర్భవతి కావడంతో శిశు సంక్షేమ శాఖ గర్భ విచ్చిత్తి చేయాలని నిర్ణయించింది. దీనికి గాను అన్ని అనుమతులు తీసుకుంటోంది. బాలికను సంరక్షించేందుకు సిద్ధమైంది. మానవ మృగాలకు బలైన బాలిక జీవితం ఎటు వైపు పోతుందో అని అందరిలో ఆందోళన నెలకొంది.
Also Read: మొదటి రాత్రిపై దుమ్ము రేపుతున్న కన్నడ హీరోయిన్ కామెంట్స్