Minister KTR : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మొదట్లో సత్సంబంధాలు కొనసాగినా జగన్ చెల్లెలు షర్మిల కొత్తగా పార్టీ ఏర్పాటు చేయడంతో రెండు రాష్ట్రాల్లో అభిప్రాయభేదాలు వచ్చాయి. ఇద్దరి మధ్య ఎడమొహం పెడమొహం గా పుట్టుకొచ్చింది. దీంతో ఇద్దరు సీఎంలు ఏ కార్యక్రమంలో కూడా కలిసి పాల్గొనలేదు. మాట్లాడుకోలేదు. అప్పటి నుంచి ఇద్దరు శత్రువులు కాకపోయినా మాటలుమాత్రం లేవు. రెండు రాష్ట్రాలు నువ్వా దరిని నేనా దరిని అన్న రీతిలో మారిపోయాయి. తెలంగాణలో షర్మిల రాకముందు జగన్, కేసీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉండేవి. షర్మిల వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయాయి.

కానీ విమర్శలు చేసుకునే వరకు మాత్రం వెళ్లలేదు. షర్మిల రాకతోనే నదీ జలాల వినియోగంపై ఒకరిపై మరొకరు గొడవలకు దిగడంతో విషయం నదీయాజమాన్య బోర్డు వరకు వెళ్లడంతో నదుల విషయం కేంద్రం పరిధిలోకి వెళ్లింది. దీంతో నీళ్ల విషయంలో ఇంకా విషయం తేలడం లేదు. దీంతో రెండు ప్రాంతాల మధ్య అపోహలు వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రయత్నాలు చేసినా కొలిక్కి రాకపోవడంతోనే నదీ జలాల పంచాయితీ కేంద్రం పరిధిలోకి వెళ్లడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సంబంధాలు బెడిసికొట్టాయని భావిస్తున్న హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహానికి తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీంతో మంత్రులను బొత్స ఆహ్వానం పలికిన తీరు చేసిన మర్యాదలకు కేటీఆర్ మురిసిపోయారు.
Also Read: ఏపీలో స్టూడియోల కోసం భూ సేకరణ.. మళ్లీ రైతుల మీదే పడుతున్న ప్రభుత్వం
వారి ప్రేమాభిమానాలకు పొంగిపోయారు. ట్విటర్ వేదికగా వారికి ధన్యవాదాలు తెలిపారు. రెండు ప్రాంతాల్లో సంబంధాలు మారలేదనడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. ఎవరి అభిప్రాయాలు వారివే. కానీ తమ విందులో వారు మనల్ని అత్యంత ఆదరంగా చూశారని కొనియాడారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల్లో మళ్లీ సంబంధాలు మెరుగుపడతాయా అనే ఆలోచనలు వస్తున్నాయి.
రాబోయే రోజుల్లో షర్మిల తెలంగాణలో రాజకీయం చేస్తుందా? లేక విరమించుకుంటుందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ ట్వీట్ కు అదే విధంగా స్పందన రావడం చూస్తూనే ఉన్నాం. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న పరిణామాల తీరుతో భవిష్యత్ లో ఇంకా ఏ పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.
Went to bless the son of AP MA&UD Minister @BotchaBSN garu yesterday, was overwhelmed with the love from my brothers from AP 😊
While we may have been separated as two separate geographical entities; Telangana & Andhra Pradesh, personal affections remain the same 🙏 #Grateful pic.twitter.com/3wkcgNmvC3
— KTR (@KTRBRS) February 12, 2022