Mamata Banerjee: అంతర్జాతీయ సంబంధాలలో కొన్ని నాయకులు, దేశాలు ఓటమిని అంగీకరించకుండా, దాన్ని విజయంగా ప్రచారం చేసే వ్యూహాన్ని అనుసరిస్తుంటారు. ఇటీవలి ఘటనలు ఈ మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరాజయం పాలైన మమతా బెనర్జీ ప్రతిస్పందన, 2025 మేలో భారత–పాకిస్తాన్ సంఘర్షణ తర్వాత పాకిస్తాన్ వైఖరి మధ్య ఆసక్తికరమైన సారూప్యత కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయ బలహీనత కాదు, వాస్తవాలను తిరస్కరించే మనస్తత్వం.
ఓటమి అంగీకరించలేక..
2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘోర పరాజయం చెందింది. బీజేపీకి 207 సీట్లు సాధించగా, టీఎంసీ80కి పరిమితమైంది. మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో సువెందు అధికారికి సుమారు 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇంత భారీ ఓటమి ఉన్నా, ఆమె ‘నేను ఓడిపోలేదు‘ అంటూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనని ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో మానిప్యులేషన్ జరిగిందని, ఓట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యేలతో సమావేశం..
తాజాగా మమతాబెనర్జీ గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. న్యాయ నిపుణులతో కూడా భేటీ అయి, పదవిలో ఎలా కొనసాగాలనే అంశంపై చర్చించారు. కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీలో అసంతృప్తి, సాధ్యమైన ఫ్లోర్ క్రాసింగ్లకు సంకేతాలు ఇస్తోంది. ఇది పార్టీలో ముసలం పుట్టినట్లు సూచిస్తోంది. ఈ వైఖరి రాజకీయ జీవనం ఒక ముఖ్యమైన అంశాన్ని బయటపెడుతుంది. అధికారం కోసం వాస్తవాలను తిరస్కరించడం. ఓటర్ల తీర్పును అంగీకరించకుండా, బాహ్య కారణాలు చెప్పి తనను తాను న్యాయవంతురాలిని చేసుకోవడం సాధారణం కావచ్చు, కానీ ప్రజాస్వామ్యానికి ఇది హానికరం.
ఆపరేషన్ సిందూర్లో..
2025 మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. లష్కర్–ఎ–తోయిబా, జైష్–ఎ–మహమ్మద్ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి, వందలాది ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్ ప్రతిదాడి చేయగా, భారత్ దాన్ని తిప్పికొట్టి, కొద్ది రోజుల్లోనే డీస్ఎల్ఎంఓ స్థాయి చర్చలతో సంఘర్షణ ముగిసింది. అయినప్పటికీ, పాకిస్తాన్ తన దేశంలో విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ‘మార్కా–ఎ–హక్‘ అని పేరు పెట్టి, ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన సంస్థలే సంబురాలు చేస్తున్నాయి. ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసి ఈ ‘విజయం‘ను జరుపుకుంటోంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కూడా ఇందులో పాల్గొంటోంది.ఇది కొత్త కాదు. 1965 యుద్ధం తర్వాత కూడా పాకిస్తాన్ ఓటమిని విజయంగా చిత్రీకరించి, డిఫెన్స్ డే జరుపుకుంటుంది. వాస్తవాలు ఏమైనా, దేశీయ ప్రచారం ద్వారా ప్రజలను మభ్యపెట్టడం ఇక్కడి వ్యూహం.
రెండు సందర్భాల్లోనూ ఓడినా..
యుద్ధంలో స్పష్టమైన ఓటమి ఉన్నా, ‘మేము గెలిచాము‘ అనే నినాదం. మమతా ఎన్నికల మానిప్యులేషన్ ఆరోపణలు, పాకిస్తాన్ మీడియా మరియు ప్రభుత్వం ద్వారా విజయ గాథలు. మమతా వద్ద ఎమ్మెల్యేల అసంతృప్తి, పాకిస్తాన్లో ఆర్థిక–సామాజిక సమస్యలను కప్పిపుచ్చడం.
ఈ వైఖరి స్వల్పకాలిక రాజకీయ లాభాలు ఇచ్చినా, ప్రజాస్వామికంగా నమ్మకం కోల్పోతుంది. ప్రజాస్వామ్యంలో ఓటర్ల తీర్పును అంగీకరించడం, యుద్ధాల్లో వాస్తవాలను అంగీకరించి సంస్కరణలు చేపట్టడం మంచి పాలనకు మూలం.ఈ సారూప్యతలు రాజకీయ నాయకులు దేశాలు ఎంతవరకు వాస్తవాల నుంచి దూరమవుతారో చూపిస్తాయి. నిజమైన విజయం ఓటములను గుర్తించి, నుంచి నేర్చుకోవడంలోనే ఉంటుంది.