
స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్దే. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టాలి.. ఏయే తేదీల్లో నిర్వహించాలి.. ఏటైంను ఎంచుకోవాలి అనేది డిసైడ్ చేస్తది. కానీ.. అదేంటో ఏపీలో మాత్రం ఎలక్షన్ కమిషన్ ప్రకటించకముందే అధికార పార్టీ వారే స్పందిస్తున్నారు. ఏకంగా తేదీలే చెప్పేస్తున్నారు. ప్రభుత్వం కీలక బాధ్యతలు అనధికారికంగా తీసుకున్న వారు ఈ లీకులు ఇస్తున్నారు.
Also Read: జగన్ ఇమేజీని పెంచేసిన పవన్ కల్యాణ్
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల గురించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబితే.. ఇంతెత్తున లేచిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏప్రిల్, మేలో నిర్వహిస్తామని ప్రకటిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికలు ఏప్రిల్, మేలో జరుగుతాయని తమ పార్టీ విశ్వసిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. చేసేది.. చేయించేది ఆయన పార్టీనే కాబట్టి.. ఆ విశ్వాసమే నిజం అని అనుకోవాలని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.
మరోవైపు.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చితో ముగుస్తుంది. అప్పటివరకూ ప్రభుత్వానికి కరోనా సెకండ్ వేవ్.. కరోనా స్ట్రెయిన్ లాంటి సమస్యలు పెద్దగా ఉంటాయి. ఆయన రిటైరైన తర్వాత.. కనగరాజునో మరొకర్నో నియమించుకున్న తర్వాత పరిస్థితులు అన్నీ సానుకూలంగా కనిపిస్తాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కరోనా పూర్తిగా అంతమైపోతుంది ఏకగ్రీవాలతో ఎన్నికలను పూర్తి స్థాయిలో ఏకపక్షంగా నిర్వహించుకునే అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అందుకే.. విజయసాయిరెడ్డి ముందస్తుగానే స్థానిక ఎన్నికల గురించి చెబుతున్నారు.
Also Read: ఆ ఆలయాలను పునర్నిర్మిస్తాం: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక మార్చిలోపు ముగస్తుంది. అది కూడా పూర్తయిన తర్వాత వైసీపీ స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల బాధ్యత తనపైనే ఉన్నట్లుగా విజయసాయిరెడ్డి చెప్పకనే ఎప్పుడు జరుగుతాయో ప్రకటించడం ద్వారా చెప్పుకున్నారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్