Homeఎన్నికలుసెంటిమెంట్ తో కొడుతున్న కేటీఆర్.. వర్కవుట్ అవుద్దా?

సెంటిమెంట్ తో కొడుతున్న కేటీఆర్.. వర్కవుట్ అవుద్దా?

KTR

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోరు రసవత్తరం అవుతోంది. కేంద్రంలోని బీజేపీపై టీఆర్‌‌ఎస్‌.. టీఆర్‌‌ఎస్‌పై బీజేపీ విమర్శలు ప్రతివిమర్శలకు పాల్పడుతున్నారు. తాజాగా.. మంత్రి కేటీఆర్‌‌ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ది ప్రెస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

Also Read: జీహెచ్‌ఎంసీలో జనసేనకు ఓట్లు రాలేనా?

‘ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్ అన్నారు. అదే విధానం మేం కూడా ఫాలో అవుతాం. మోదీ మాటే తమ మాట. ఢిల్లీ పార్టీ కావాలా? గల్లీ పార్టీ కావాలా ? ప్రజలే తేల్చుకోవాలి. మాది గల్లీ పార్టీ. వారిది ఢిల్లీ పార్టీ. గల్లీ పార్టీ హైదరాబాద్‌ను ఏలాలా ? ఢిల్లీ పార్టీ హైదరాబాద్‌ను ఏలాలో ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. విషంతో నిండిన హైదరాబాద్ కావాలా? విశ్వాసంతో నిండిన హైదరాబాద్ కావాలా? కొందరి హైదరాబాద్ కావాలా? అందరి హైదరాబాద్ కావాలా?’ అన్నది ప్రజలే తేల్చుకోవాలన్నారు.

దుబ్బాక ఓటమి తమకు పెద్ద సమస్య కాదనని అన్నారు కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ది మొదటి స్థానం అన్నారు. రెండో స్థానంలో ఎవరు ఉంటారన్నది ప్రజలే తేల్చుతారన్నారు. అది కాంగ్రెస్, బీజేపీ అన్నది వాళ్లకే తెలుసన్నారు. గోల్కొండపై ఎవరు ఏ జెండా ఎగురవేసినా.. బల్దియాపై గులాబీ జెండా ఎగరేసేది మాత్రం తామే అన్నారు. ఇప్పటికే గోల్కొండపై కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారన్నారు. బహుశా ఆ విషయం బండి సంజయ్‌కు తెలియదేమో అంటూ సెటైర్లు వేశారు.

Also Read: ఫస్ట్‌ లిస్టులో ప్రముఖులకు షాకిచ్చిన కేసీఆర్!

మేయర్ పదవి టీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళకే దక్కుతుందని.. మేయర్ పదవి ఎంఐఎంకు ఇస్తామన్నది పిచ్చిమాటలు అని కేటీఆర్‌‌ విమర్శించారు. ఎంఐఎంతో తమకు ఎలాంటి పోటీ లేదన్నారు. 150 డివిజన్లలో టీఆర్ఎస్ పోటీ చేస్తోందన్నారు. పాతబస్తీలో 5 సీట్లు గెలుస్తామన్నారు. ఈసారి పది సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరద సాయం కింద కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణకు ఆరేళ్లలో కేంద్రం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇలా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈసారి హైదరాబాద్ ప్రజలపై సెంటిమెంట్ తో కొడుతున్నట్టు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. కేటీఆర్ కామెంట్స్ ను ప్రజలు పరిగణలోకి తీసుకుంటారా? బీజేపీని గెలిపిస్తారా? అన్నది వేచిచూడాలి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular