టీపీసీసీ చీఫ్‌ కొండా సురేఖ..?

కాంగ్రెస్‌ జాతీయ పార్టీ ఇప్పటికే నాయకత్వ లోపంతో ఇబ్బంది పడుతోంది. ఈ ఐదేళ్లలో జరిగిన ఎన్నికలను బట్టి చూస్తుంటే అందరికీ అదే అర్థమవుతోంది. అయితే.. ఇప్పుడు పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. అందుకోసం ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ సీనియర్ శ్రేణులతో సమావేశమైన సంగతి తెలిసిందే. Also Read: బీజేపీ జాతీయ విద్యావిధానంతో ఎవరికి లాభం? ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలోనూ పార్టీ పరిస్థితి అంతకంతకే ఉంది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ […]

Written By: Srinivas, Updated On : December 27, 2020 10:09 am
Follow us on


కాంగ్రెస్‌ జాతీయ పార్టీ ఇప్పటికే నాయకత్వ లోపంతో ఇబ్బంది పడుతోంది. ఈ ఐదేళ్లలో జరిగిన ఎన్నికలను బట్టి చూస్తుంటే అందరికీ అదే అర్థమవుతోంది. అయితే.. ఇప్పుడు పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. అందుకోసం ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ సీనియర్ శ్రేణులతో సమావేశమైన సంగతి తెలిసిందే.

Also Read: బీజేపీ జాతీయ విద్యావిధానంతో ఎవరికి లాభం?

ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలోనూ పార్టీ పరిస్థితి అంతకంతకే ఉంది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవానికి బాధ్యతగా పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడిగా ఎవరు నియమితులవుతారో అని తెలంగాణలో చర్చ మొదలైంది. పీసీసీ చీఫ్‌ కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిన్నటివరకు ప్రధానంగా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్కల పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా.. మాజీ మంత్రి, మహిళా నాయకురాలు కొండా సురేఖ ఆ పదవి రేస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ అధిష్ఠానం ఈసారి మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోందట. ఎందుకంటే ఇంతకు ముందు పార్టీలో ఉన్న సీనియర్ నేతలు డీ.కె.అరుణ, విజయశాంతి బీజేపీలోకి వెళ్లిపోయారు. అందుకే పార్టీలో వారికి దీటుగా మహిళలకు పెద్దపీట వేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అంతేకాకుండా కొండా సురేఖకు రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన బీసీ సామాజిక వర్గాల్లో మంచి సంబంధాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, మంచి వాక్చాతుర్యం లాంటివి అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: ఖజానా కల్లాస్‌ : రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌తో రూ.30 వేల కోట్ల నష్టం

అంతేకాదు.. ప్రస్తుత ఎమ్మెల్యే, ఆదివాసీ నాయకురాలు సీతక్కకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించడంతో పాటు కీలక కమిటీల్లో ఆమె పేరు చేరుస్తారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆమెకు సైతం మహిళా విభాగం పగ్గాలు అప్పజెప్పేస్తే మహిళలను ఆకట్టుకోవచ్చనేది అధిష్టానం భావిస్తోంది. ఏదిఏమైనా కాంగ్రెస్‌ అధిష్టానం పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించేం వరకూ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఈ ఉత్కంఠ పోయే పరిస్థితి అయితే కనిపించడం లేదు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్