KCR :  ఫ్లాష్… ఫ్లాష్.. కొత్త పార్టీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR : టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సాక్షిగా ఆ పార్టీ అధ్యక్షుడు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కావని.. ప్రత్యామ్మాయ ఎజెండా కావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొత్త పార్టీపై సీఎం కేసీఆర్ పరోక్షంగా హింట్ ఇచ్చినట్టైంది. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడిన కేసీఆర్.. గతంలో అనే రాజకీయ ఫ్రంట్లు వచ్చాయని.. అవి ఏం సాధించాని ప్రశ్నించారు. రాజకీయ పునరేకీకరణతో సాధించబోయేది ఏదీ లేదని అన్నారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే […]

Written By: NARESH, Updated On : April 27, 2022 1:03 pm
Follow us on

KCR : టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సాక్షిగా ఆ పార్టీ అధ్యక్షుడు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కావని.. ప్రత్యామ్మాయ ఎజెండా కావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొత్త పార్టీపై సీఎం కేసీఆర్ పరోక్షంగా హింట్ ఇచ్చినట్టైంది. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడిన కేసీఆర్.. గతంలో అనే రాజకీయ ఫ్రంట్లు వచ్చాయని.. అవి ఏం సాధించాని ప్రశ్నించారు. రాజకీయ పునరేకీకరణతో సాధించబోయేది ఏదీ లేదని అన్నారు.

దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే ప్రత్యామ్మాయ సిద్ధాంతానికి ప్రారంభం పడాలని.. దానికి హైదరాబాద్ వేదిక కావాలని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ వేదికగా దేశ స్థితిని, గతిని మార్చేలా కొత్త ఎజెండా రూపొందితే అది మనకే గర్వకారణమన్నారు. ఉన్నపాటున ప్రజలు తమ గుండెలపై చేయి వేసుకొని దేశ లక్ష్యం ఏంటో చెప్పుకునే పరిస్థితి లేదని అన్నారు. దేశ లక్ష్యం ఉంటే ఒక వ్యక్తి చెప్పే సిద్ధాంతమో.. ఓ పార్టీ ప్రవరించే నాలుగు మాటలు కాదని అన్నారు. దేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందన్నారు.

దేశ ప్రజల సామూహిక లక్ష్యమే దేశ లక్ష్యం అయి ఉండాలని అన్నారు. ఒక గమ్యం దిశగా దేశం మొత్తం ప్రయాణం చేయాలని.. అలా అన్ని దేశాలు అభివృద్ధి దిశగా వెళుతుంటే భారతదేశం మాత్రం తన గమ్యాన్ని మర్చిపోయిందన్నారు. ఈ దేశంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని చూస్తూ మౌనంగా ఉండిపోదామా? అని ప్రశ్నించారు.

1980 వరకూ భారత జీడీపీ కన్నా చైనా జీడీపీ తక్కువ అని.. ఇప్పుడు ప్రపంచంలోనే సూపర్ పవర్ గా అవతరించిందన్నారు. ఉన్న వనరులను ఉపయోగించుకోవడం లేదని అన్నారు. మన రాష్ట్రంలో ఉండే ఓ జిల్లా అంత లేని ఇజ్రాయెల్ దేశం నుంచి మనం ఆయుధాలు కొనుగోలు చేసే స్థితిలో ఉన్నామని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అద్భుతమైన అటవీ, ఖనిజ, జల సంపద ఉన్నప్పటికీ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం మన ఖర్మ అని వ్యాఖ్యానించారు.

దీన్ని కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ లో ఉన్నారని.. సమయం, సందర్భం వస్తే పార్టీని ప్రకటించి ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఈ మేరకు పరోక్ష వ్యాఖ్యలతో కేసీఆర్ సంకేతాలు పంపారు.