మునిగిపోయే దశలో ఉన్న ఆర్టీసీని రక్షించేందుకు ఛార్జీలు పెంచామని సమర్ధించుకోవడం తెలిసిందే. పెంచిన ఛార్జీలతోనే బడ్జెట్ లో ఆర్టీసీకి వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించామని సూచించారు. ఆర్టీసీని మళ్లీ లాభాల బాట పట్టించేందుకు గూడ్స్ పద్దతిని అవలంభిస్తున్నామని, త్వరలో ఆ ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించారు.
ఆ తర్వాత దివాళా స్థితిలో ఉన్న డిస్కోమ్ లను కాపాడటం కోసం విద్యుత్ చార్జీలు పెంచడం తప్పనిసరి అని ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా, రాష్ట్రాభివృద్ధి కోసం, ఆర్ధిక మనుగడ సాధించాలంటే కొన్ని రంగాల్లో మార్పులు చేయడం అవసరమని అన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్, ఇసుక, మైన్స్, కరెంట్ , మద్యం ధరల్ని పెంచబోతున్నట్లు తేల్చి చెప్పారు.
కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ త్వరలోనే మద్యం ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించారు. గతంలో మద్యపాన నిషేదం విధిస్తే అట్టర్ ప్లాప్ అయ్యిందన్న కేసీఆర్..మద్యం తాగకుండా ఉండేలా ధరల్ని పెంచుతున్నట్లు పేర్కొనడం గమనార్హం.