KA Paul : ఏపీలో నేతలకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

అటు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉంటూ అప్రూవర్గ మారిన దస్తగిరి సైతం ఆ పార్టీలో చేరారు.దీంతో కేఏ పాల్ దూకుడు పెంచారు.నేరుగా యువతకు ఫోన్ మెసేజ్ ల ద్వారా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే కేఏ పాల్ బంపర్ ఆఫర్ ను చూసి యువత తెగ నవ్వుకుంటున్నారు. కొందరు టికెట్ కావాలంటూ తిరిగి మెసేజ్ లు పెడుతున్నారు.

Written By: NARESH, Updated On : March 13, 2024 6:55 pm

KA Paul

Follow us on

KA Paul : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కేఏ పాల్ సందడి చేస్తుంటారు. తన ప్రజాశాంతి పార్టీని బరిలో దించుతారు. మొన్నటికి మొన్న తెలంగాణలో ఎన్నికల్లో సత్తా చాటడానికి ప్రయత్నించారు. కానీ సత్తాను పక్కనపెట్టి అక్కడ జనాలకు వినోదం పంచారు. ఇప్పుడు ఏపీలో సైతం అదే తరహా వినోదం పంచడానికి సిద్ధపడుతున్నారు.ఏపీలో రాజకీయ పార్టీల టికెట్లకు గిరాకీ ఏర్పడుతున్న తరుణంలో.. తన ప్రజాశాంతి పార్టీ తరఫున బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు. ఏకంగా ఫోన్లకు మెసేజ్ లు పంపి టికెట్ కావాలా అని అడుగుతున్నారు. ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ రాజకీయ పార్టీలతో పాటు చాలా పార్టీలు ఉన్నాయి.అయితే వాటి మనుగడ అంతంత మాత్రమే. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే కిలారి ఆనందపాల్ అలియాస్ కే ఏ పాల్ ఈసారి మిగతా ప్రాంతీయ పార్టీల కంటే ముందంజలో ఉంటానని చెబుతున్నారు. పోటీ చేస్తారా..టిక్కెట్ ఇస్తాం.. యువ రక్తాన్ని పారిస్తా.. మీ గెలుపునకు మాది భరోసా.. అంటూ ఫోన్లకు ఏకంగా పాల్ పేరిట మెసేజ్లు పంపుతున్నారు. అక్కడితో ఆగుతున్నారా అంటే అది లేదు.. జిల్లాలో కేవలం రెండు సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయని.. విపరీతమైన పోటీ ఉందని.. ఇక మీ ఇష్టం అంటూ తేల్చి చెబుతున్నారు.

అయితే కేఏ పాల్ ఈ తరహా దూకుడుకు కారణం తెలంగాణలో సీనియర్ నాయకుడు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. మరోవైపు జడ శ్రావణ్ కుమార్ నేతృత్వంలోని పార్టీలోకి కోడి కత్తి శీను వచ్చాడు. అటు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉంటూ అప్రూవర్గ మారిన దస్తగిరి సైతం ఆ పార్టీలో చేరారు.దీంతో కేఏ పాల్ దూకుడు పెంచారు.నేరుగా యువతకు ఫోన్ మెసేజ్ ల ద్వారా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే కేఏ పాల్ బంపర్ ఆఫర్ ను చూసి యువత తెగ నవ్వుకుంటున్నారు. కొందరు టికెట్ కావాలంటూ తిరిగి మెసేజ్ లు పెడుతున్నారు.